పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

27, డిసెంబర్ 2011, మంగళవారం

శతవసంతాల మన "జనగణమన"...!

జాతీయ గీతం జనగణమనకు ఈ రోజుతో వందేళ్ళు పూర్తి అయ్యాయి.
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన 'జనగణమన' మొట్టమొదటి సారిగా 1911 లో డిసెంబర్ 27 న
కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఆలపించారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1950,జనవరి 24 న ఈ గీతానికి జాతీయగీతం హోదాదక్కింది.
'జనగణమన' భారతీయ స్ఫూర్తిని,భారతీయుల భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే అపురూప గేయం.
భరతమాత కీర్తి ప్రతిష్టతలను చాటుతూ...భారత దేశ భౌగోళిక స్వరూపాన్నిదాని అంతస్సారంతో వర్ణించే అక్షర చిత్రమిది.

'ప్రజలందరి మనస్సుకు అధినేతవు,భారత భాగ్య విధాతవు అయిన నీకు జయమగుగాక,
పంజాబ్,సింధు,గుజరాత్,మహారాష్ట్ర,ద్రావిడ,ఉత్కళ,వంగ దేశాలతోనూ,
వింధ్య,హిమాలయ పర్వతాలతోనూ,యమునా,గంగ ప్రవాహాలతో ఉవ్వెత్తున లేచే సముద్ర తరంగాలతోను
శోభించే భాగ్య విధాత,వాటికి నీ శుభనామం ఉద్భోధనిస్తుంది.
అవి నీ ఆశీస్సులు ఆకాంక్షిస్తాయి.నీ జయ గాధల్ని గానం చేస్తాయి.
సకల జనులకు మంగళ కారకమైన,భారత భాగ్య విధాతవు అయిన నీకు
జయమగు గాక! జయమగు గాక! జయమగు గాక!'

మొత్తం 31 చరణాలతో రవీంద్రుడు జనగణమన రాయగా అందులో ఏడు చరణాలను మనం జాతీయ గీతంగా ఆలపిస్తున్నాం.జాతీయ గీతం రచించిన భాష సంస్కృత మిళిత బెంగాలీ అయినా,
భారతీయులంతా దీన్ని తమమాతృ గీతం గా అనుభూతి చెంది పాడుకునేలా మన జాతీయ గీతం రూపు దిద్దుకుంది.


Janaganamana
(full song of National Anthem of India)





ఎక్కడ  విన్నా వినపడకపోయినా ఉదయాన్నే స్కూల్ అసెంబ్లీ లో ..సాయంత్రం స్కూల్స్ వదిలే టైం లో
విద్యార్ధుల గొంతులో స్వరమై చేరి,భారతీయుడి జీవితంపై చెరగని ముద్ర వేసిన ఈ శుభ గానం
వందేళ్ళైనా,ఇంక ఎన్నేళ్ళైనా... ప్రతి క్షణం భారత దేశ సమున్నతిని చాటుతూనే వుంటుంది.


6 కామెంట్‌లు:

sandeep చెప్పారు...

Good post

Jai Hind..

సుభ/subha చెప్పారు...

రాజీ గారూ చక్కని విషయం తీసుకొచ్చారు.ధన్యవాదాలు..
జై హింద్..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

Thankyou Sandeep gaaru

JaiHind..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

పోస్ట్ నచ్చినందుకు థాంక్యూ "సుభ" గారూ
జైహింద్..

sharma చెప్పారు...

జైహింద్!

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

జైహింద్! sharma గారూ..

Related Posts Plugin for WordPress, Blogger...