పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

30, డిసెంబర్ 2011, శుక్రవారం

A.P. STATE BAR COUNCIL Elections..


అభ్యర్ధుల ప్రచారాస్త్రాలు..



ఈ రోజు స్టేట్ బార్ కౌన్సిల్ Elections జరుగుతున్నాయి. ఐదేళ్లకొక సారి జరిగే ఎన్నికల్లో
ఈసారి 134 మంది అభ్యర్ధులు పోటీలో వున్నారు.వీరిలో నుండి 25 మంది సభ్యులను ఎన్నుకోవాల్సి వుంటుంది.
రాష్ట్రవ్యాప్తంగా 68,000 పైగా న్యాయవాదులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు .
గుంటూరు జిల్లానుండి 12 మంది న్యాయవాదులు పోటీలో వున్నారు.
గుంటూరు జిల్లాలో 3,677 మంది న్యాయవాదులకు ఓటుహక్కు వుంది.
అందులో
నా ఓటు కూడా ఒకటి


All The Best Participants..


నా కవిత...!


చేతిలో కలంతో కాగితంపై గీస్తూ
మరోచేతి గోళ్ళను మునిపంటితో కొరికేస్తూ

కలువల్లాంటి కళ్ళకి శూన్యాన్ని చూపిస్తూ

మెదడుకు మేతను తినిపిస్తూ...


హృదయాన్ని తికమక పెట్టేస్తూ

మీ పెదవులపై నవ్వుని విరబూయిస్తూ

మంచి కవితనొకటి రాయాలని యోచిస్తూ

నడిరేయంతా మేల్కొన్నాను ఆలోచిస్తూ...


నాలుగక్షరాలని అటువిటు రాస్తూ

మురిసిపోయాను పైన, క్రింద చదివేస్తూ

నా పిచ్చిరాతలనుండి మిమ్మల్ని రక్షిస్తూ

సమయం మేల్కొల్పింది నన్ను వెక్కిరిస్తూ...


Telugu Quotes community

Related Posts Plugin for WordPress, Blogger...