పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

30, ఏప్రిల్ 2010, శుక్రవారం

భద్రం బీ కేర్ఫుల్ బ్లాగరూ .....

కొత్తగా బ్లాగ్ మొదలు పెట్టి ఏమి రాయొచ్చో,ఏమి రాయకూడదో ఆలోచిస్తూ,ఆచి తూచి బ్లాగ్ లో పోస్టింగ్స్ పెడుతున్న నాకు ఇవాళ ఒక మంచి మార్గదర్శి కనిపించింది.

గొప్ప నిజాల్ని సరదాగా తెలియ చేసిన ఒక కధ నవ్వు తెప్పించేదిగా అలాగే ఆలోచించేలా చేసేదిగా వుంది.
సాక్షి ఈ పేపర్ ఫన్ డే 18-04-2010 లో వచ్చిన 'రామనాధం గారి బ్లాగ్ కధ' చదివాను.

బ్లాగ్ రాయాలన్న ఆసక్తి ఉండొచ్చు కానీ బ్లాగ్ రాయటం శ్రుతి మించితే వచ్చే ఇబ్బందులను,తీసుకోవాల్సిన జాగ్రత్తలను సరదాగా నవ్వుకునేలా తెలియచేసిన ఈ కధ చాలా బాగుంది.



రాజి
Related Posts Plugin for WordPress, Blogger...