పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

22, అక్టోబర్ 2012, సోమవారం

దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖ హంత్రీ సుఖ ప్రదా


శ్రీ దుర్గాదేవి - దుర్గాష్టమి - 22 - 10 - 2012 

ఆశ్వయుజ శుద్ధ అష్టమి 

ఆశ్వయుజ శుద్ధ అష్టమినాడు అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరిస్తారు. దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపిణి అమ్మవారు దుర్గాదేవి. 
ఈ రూపంలో అమ్మవారు దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచప్రకృతి మహాస్వరూపాలలో దుర్గాదేవి మొదటిది. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షం ప్రసాదిస్తుంది. కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మని అర్చిస్తే శత్రుబాధలు నశిస్తాయి. విజయం కలుగుతుంది. సకల గ్రహ బాధలు తల్లి నామం జపిస్తే తొలగిపోతాయి. 

ఆరాధకులకు అమ్మ శీఘ్ర అనుగ్రహకారిణి, ఎర్రని బట్టలు పెట్టి, ఎర్ర అక్షతలు, ఎర్ర పుష్పాలతో అమ్మను పూజించాలి. దుర్గా సూక్తం పారాయణం చెయ్యాలి. “ఓం దుం దుర్గాయైనమః” అనే మంత్రాన్ని పఠించాలి.“ఆయుధ పూజ లేక అస్త్రపూజ” చేస్తారు. దుర్గమ్మను లలితా అష్టోత్తరం, లలితా సహస్రంతో పూజిస్తే ఆ తల్లి పరమశాంతి స్వరూపంతో మనల్ని కటాక్షిస్తుంది. శరన్నవరాత్రుల్లో శార్దూల వాహినిగా, త్రిశూలాన్ని ధరించిన శక్తిస్వరూపిణిగా దర్శనమిస్తుంది.
  
 దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖ హంత్రీ సుఖ ప్రదా



యాదేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై  నమో నమః
యాదేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై  నమో నమః

శ్రీ దుర్గా స్తోత్రం 
 
 

  


Related Posts Plugin for WordPress, Blogger...