పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..
బాపుబొమ్మల హరివిల్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
బాపుబొమ్మల హరివిల్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, జనవరి 2012, శుక్రవారం

బాపుబొమ్మల సంక్రాంతి శుభాకాంక్షలు ...


ముంగిళ్ళలో మెరిసే ముగ్గులు,
ముగ్గుల మెలికల మధ్య ఒదిగిన గొబ్బెమ్మలు,
హరిదాసు కీర్తనలు,జంగందేవర దీవెనలు,
తియ్య తియ్యని పిండివంటలు,
బంధుమిత్రుల కోలాహలాల మధ్య
తెలుగుతనం ఉట్టిపడేలా సంక్రాంతి పండగ జరుపుకుంటున్నఅందరికీ
బాపు బొమ్మలతో బుడుగు సీగాన పెసూనాంబల
సంక్రాంతి శుభాకాంక్షలు.



16, డిసెంబర్ 2011, శుక్రవారం

ధనుర్మాసం మొదలయ్యింది...!


ధనుర్మాసం వచ్చేసింది..

కొత్త సంవత్సరం ఆగమనాన్ని గుర్తు చేస్తూ.. ఇప్పటి నుండి మొదలు పెట్టి సంక్రాంతి పండుగ వరకు
ఇంటి
వాకిళ్ళను కళ కళ లాడేలా తీర్చిదిద్దే రంగవల్లులతో
హరిలోరంగా హరి అంటూ భగవన్నామస్మరణ చేస్తూ వచ్చిన హరిదాసుతో ,
ధనుర్మాసం లో విష్ణు మూర్తికి పూజ చేసే "తిరుప్పావై పాశురాలతో" మన ఇళ్ళల్లోనే కాదు ..
మన బ్లాగ్ లలో కూడా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది..

నేను కూడా ఈ సంవత్సరం నా "భక్తిప్రపంచం" బ్లాగ్ లో "తిరుప్పావై పాశురాలు" పోస్ట్ చేస్తున్నాను..

ఈ ధనుర్మాసం అంతా మీరు కూడా మంచి మంచి ముగ్గులు వేయాలని,
చక్కగా ధనుర్మాసం పూజలు చేసుకోవాలని కోరుకుంటూ..


15, డిసెంబర్ 2011, గురువారం

బాపూగారికి.. బాపూబొమ్మలు చెప్పే పుట్టినరోజు శుభాకాంక్షలు..


కొంటె బొమ్మల బాపు
కొన్ని తరముల సేపు
గుండె ఊయలలూపు
ఓ కూనలమ్మా..

అనిపించేలా ,సొగసు చూడతరమా... అనేలా బాపూగారు సృష్టించిన
కొందరు ముద్దులొలికే బాపు బొమ్మలు బాపుగారికి
పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు..


బాపూగారికి పుట్టిన రోజు శుభాకాంక్షలతో ...


22, నవంబర్ 2011, మంగళవారం

బాపు బొమ్మల హరివిల్లు - యశోదకృష్ణ

చేతవెన్నముద్ద చెంగల్వ పూదండ
బంగారు మొలతాడు పట్టు దట్టి
సందిట
తావీదు సరిమువ్వ గజ్జెలు
చిన్నికృష్ణా
! నిన్ను చేరి కొలుతు ...
ముద్దుగారే యశోద ముంగిటా ముత్యము వీడు
దిద్దరాని
మహిమల దేవకీ సుతుడు
అంతనింత గొల్లతల అరచేతి మాణిక్యము
పంతమాడే
కంసుని పాలి వజ్రము
కాంతుల
మూడులోకాల గరుడపచ్చపూసా
చెంతల
మాలో నున్న చిన్నికృష్ణుడు
ముద్దుగారే యశోద ముంగిటా ముత్యము వీడు
దిద్దరాని
మహిమల దేవకీ సుతుడు
రతికేళి రుక్మిణికి రంగు మోవి పగడము
మితి
గోవర్ధనపు గోమేధికము
సతమై
శంఖచక్రాల సందుల వైడూర్యము
గతియై
మమ్ము గాచేటి కమలాక్షుడు
కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము
యేలేటి
శ్రీవేంకటాద్రి యింద్రనీలము
పాల
జలనిధిలోన బాయని దివ్యరత్నము
బాలునివలె
దిరిగే పద్మనాభుడు
ముద్దుగారే యశోద ముంగిటా ముత్యము వీడు
దిద్దరాని
మహిమల దేవకీ సుతుడు




19, నవంబర్ 2011, శనివారం

బాపు బొమ్మల హరివిల్లు - శ్రీ రామరాజ్యం.


జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా
శుభస్వాగతం ప్రియ పరిపాలకా..




బాపుబొమ్మల హరివిల్లు - గజేంద్రమోక్షం

మనుషులు ఎన్ని కష్టాలు వచ్చినా తమకు తాము పరిష్కరించుకోవటానికి శాయశక్తులా ప్రయత్నిస్తారు
ఆ ప్రయత్నంలో గెలిచినప్పుడు కొన్నిసార్లు సమస్యను మనమే తీర్చుకున్నాము అనుకుంటాం..
మరికొన్నిసార్లు దేవుడా నాకు ఈ కష్టాన్ని తీర్చు అని భగవంతుడిని ప్రార్దిస్తాం.
మనం అడిగినా అడగక పోయినా మన ప్రతి కష్టంలోనూ ఆ సర్వాంతర్యామి తోడుంటాడు..
క్షణమైనా మన సమస్య తీర్చి,మనల్ని కాపాడటానికి తోడుండే ఒకే ఒక్క ఆప్తుడు భగవంతుడు.
ఆపదలో వున్న తన భక్తులను కాపాడటానికి తను ఎలాంటి పరిస్థితిలో వున్నా లెక్క చేయక,
తన భక్తుడుని కాపాడటమే కర్తవ్యంగా పరుగు పరుగున శ్రీ మహాలక్ష్మితో సహా వచ్చే శ్రీ మహా విష్ణువు
వర్ణన తో కూడిన గజేంద్రమోక్షం అద్భుతంగా వుంటుంది.

ఎంతో అద్భతంగా పోతన రచించిన ఈ గజేంద్రమోక్షం మరెంతో అద్భుతంగా తన చిత్రాలతో వర్ణించారు బాపు.
బాపు బొమ్మల హరివిల్లు పుస్తకంలో గజేంద్ర మోక్షం చిత్రాలు చాలా బాగున్నాయి
వాటితో కలిపి పోతన భాగవతంలోని గజేంద్ర మోక్షంలో నాకు నచ్చిన,మా అమ్మమ్మ చిన్నప్పుడు
మాకు నేర్పిన కొన్నిపద్యాలు తాత్పర్యాలతో



బాపు బొమ్మల హరివిల్లు - గజేంద్రమోక్షం
పోతన భాగవతం - గజేంద్ర మోక్షం


సరసిలోనుండి పొడగని సంభ్రమించి
యుదరి కుప్పించి లంఘించి హుంకరించి
భానుఁ గబళించి పట్టు స్వర్భానుపగిది
నొక్క మకరేంద్రుఁ డిభరాజు నొడిసిపట్టె.

గజేంద్రుడు తన ప్రియసఖులతో కలిసి ఒక కొలనులో జలకమాడుతుండగా
కొలనులోని ఒకమొసలి కొలనునుండి బయటికి వచ్చి
ఊపిరి బిగియపట్టి రొప్పుతూ గజేంద్రుని చెంతచేరి
రాహువు సూర్యుని మ్రింగుటకై పట్టినట్లుగా
గజేంద్రుని కాలు గట్టిగా పట్టుకునెను.

ఏనుగును బంధించుటకు మొసలి, మొసలి పట్టు నుండి తప్పుకొవటానికి ఏనుగు
ఒకదానినొకటి
బలంగా లాగుకొనుచుండగా
నీటిలోపలి మొసళ్ళు ఏనుగు కంటే మొసలి బలమైనదని,
బయటి ఏనుగులు మొసలి కంటే ఏనుగు బలమైనదని అనుకున్నాయి..
మొసలి ఎంతో పట్టుదలతో ఏనుగును వదలకుండా పట్టుకుంది.
గజేంద్రుడు మొసలి పట్టుకున్న తన కాలును విడిపించుకోలేక ఎంతో దిగులు పడుతూ

ఏ విధముగా నేను దీనిని జయించగలను? ఏ దేవుని ధ్యానించాలి?
ఎవరిని నాకు తోడుగా పిలవాలి?ఈ మొసలిని అడ్డగించే వారేవ్వరున్నారు?
దిక్కు లేని నా దీన ధ్వనిని విని నన్ను కాపాడు పరోపకారులగు పుణ్యాత్ములకు
నే మ్రొక్కెదను వారు నన్ను రక్షించెదరు..
అని పరి పరి విధములుగా భగవంతుని ప్రార్దిస్తున్నాడు గజేంద్రుడు

ఎవ్వనిచే జనించు జగ; మెవ్వనిలోపల నుండు లీనమై;
యెవ్వని యందుడిందుఁ; బర మేశ్వరుఁ డెవ్వడు; మూల కారణం
బెవ్వఁడ నాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైనవాఁ
డెవ్వఁడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేఁడెదన్.

ఎవని వల్ల జగములు పుట్టి ,పెరిగి ,నశించుచున్నవో,
ఎవ్వ
డన్ని వస్తువులకు ప్రభువో,ఎవ్వడన్నిటికీ మూల కారణుడో,
ఎవ్వనికి
మొదలు నడుమ ఆఖరు అనునవి లేవో
ఎవడు సర్వాత్మ స్వభావుడో అట్టి భగవంతుని నన్ను కాపాడమని వేడుచున్నాను..


కలఁ డందురు దీనుల యెడఁ
గలఁ డందురు పరమయోగి గణములపాలం
గలఁ డందు రన్ని దిశలను
గలఁడు కలం డనెడువాఁడు గలఁడో లేఁడో.

దీనులు,యోగుల నందు ...అన్ని దిక్కుల్లోను
భగవంతుడు
నిండి ఉన్నాడని పెద్దలు చెప్తారు.
అట్టి భగవంతుని ఎన్ని విధాలుగా ప్రార్దించినను రాకున్నాడు..
ఉన్నాడన్న అట్టి భగవంతుడు వున్నాడా లేదా అని సందేహం కలుగుతుంది..


లావొక్కింతయులేదు; ధైర్యము విలో; లంబయ్యె బ్రాణంబులున్;
ఠావుల్దప్పెను; మూర్ఛవచ్చెఁ; దనువున్ డస్సెన్; శ్రమంబయ్యెడిన్;
నీవే తప్ప నితఃపరంబెఱుగ మన్నింపందగున్ దీనునిన్
రావే ఈశ్వర; కావవే వరద; సంరక్షింపు భద్రాత్మకా!

ఈశ్వరా ఇంతవరకు మొసలితో పోరాడి నా బలమంతా తగ్గినది
ఇంతవరకు నేను మకరమును జయిస్తాను అనుకున్నాను
ధైర్యము పోయినది.. ప్రాణములు పైకెగిరి పోతున్నాయి.
మైకము వస్తుంది దేహం అలసటగా వుంది
ఈశ్వరా నీవు తప్ప వేరెవ్వరు తెలియదు.
నేనిదివరకు ఎన్ని అపరాధములు చేసి వున్నను
వానినెల్ల మన్నించి భగవంతుడా నా వద్దకు వచ్చి నన్ను కాపాడుము


అలవైకుంఠ పురంబులో నగరిలో నామూల సౌధంబు
దా
,పల మందారవనాంతరామృతసరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంకరమావినోదియగు నా పన్న ప్రసన్నుండు
వి
హ్వల నాగేంద్రము 'పాహి పాహి' యనఁ గుయ్యాలించి సంరంభియై.

వైకుంఠపురంలోని ప్రధాన సౌధమునందు కల్పవృక్ష వనమందు,
అమృత సరోవర తీరమున చంద్రకాంత మణులు,కలువ పూవులు పరచిన పాన్పునందు
శ్రీ లక్ష్మీ దేవితో గూడ విహరించు చున్నవాడైన శ్రీ నారాయణుడు
తన భక్తుడగు గజరాజు నొచ్చిన వాడై దేవా నన్ను కావుము
అని ప్రార్ధించుచుండగా మొరలను విని తత్తరపాటున లేచి


సిరికిం జెప్పఁడు; శంఖచక్రయుగముం జేదోయి సంధింపఁడే
పరివారంబును జీరఁ డభ్రగపతిం బన్నింపఁ డాకర్ణి
కాం
తర ధమ్మిల్లముఁ జక్కనొత్తఁడు వివాదప్రోత్థిత శ్రీకుచో
పరిచేలాంచలమైన వీడఁడు గజ ప్రాణవనోత్సాహియై.

విధంగా శ్రీ మన్నారాయణుడు తానూ భక్త పరాధీనుడు కనుక
తన భక్తుడగు గజేంద్రుని ఆపద తీర్చుటకు బయలుదేరి, తొందరలో
లక్ష్మీదేవికి చెప్పక,శంఖ చక్రములను ధరించక,భటులను కూడా తీసుకొని పోక,
గరుడుని మీద ఎక్కక,జారిన జుట్టు ముడి వేసుకొనక,
లక్ష్మీదేవితో అపుడు వాడులాడుచు వేడుకతో తాను పట్టిన లక్ష్మీదేవి పైట కొంగును కూడా వీడక,
శ్రీదేవి పైటకొంగు నీడ్చుకునే బయలు దేరేను..


తన వెంటన్ సిరి, లచ్చివెంట నవరోధవ్రాతమున్, దాని
వెన్కను బక్షిమంద్రుఁడు, వాని పొంతను ధనుఃకౌమోదకీ శంఖ
క్రనికాయంబును, నారదుండు, ధ్వజినీ కాంతుండు రా వచ్చి
రొయ్యన వైకుంఠపురంబునం గలుగువా రాబాలగోపాలమున్.

శ్రీమన్నారాయణుడు అట్లు తత్తరపడి పోవుటకు కారణము తెలుసుకొనుటకు
లక్ష్మీదేవి అతనిని వెంబడించింది .. లక్ష్మి వెంట అంతఃపురాంగనలందరు,
వారిని గరుత్మంతుడు వెంబడించెను. గరుత్మంతుడి వెనుక శంఖము,చక్రము
మొదలగు ఆయుధములన్నీ వచ్చెను.వాటి వెంబడి నారదుడు విష్వక్సేనుడు వచ్చిరి.
వారి వెంబడి వైకుంఠ పురము నందలి ఆబాలగోపాలము వచ్చిరి..


రాక్షసులను సంహరించు వాడు,దయా సాగరుడు,యోగీంద్రుల హృదయములనందు
నివసించు వాడు,భక్తులకు మహిమలను చూపు వాడు,ఆశ్రితులను మన్నించు వాడు,
ఎల్లప్పుడూ పెళ్లి కూతురివలె శోభించు లక్ష్మీ దేవి పతియగు శ్రీ మహా విష్ణువు
బాధలోనున్న ఆ గజేంద్రుని కష్టాన్ని చూసి ఆ మకరాన్ని ఖండించుటకు
తన చక్రాయుధాన్ని పంపెను ..ఆ చక్రాయుధము పోయి ఎలా అయినా సరే గజేంద్రుని జయించి
గెలుపొందాలన్న పట్టుదలతో వున్న మొసలి యొక్క శిరస్సు తుంచి దానిని సంహరించెను..

ఆ మొసలి పట్టు నుండి తప్పుకున్న ఆ గజరాజును శ్రీ మహావిష్ణువు తన చేతి స్పర్శతో తాకి
భయం పోగొట్టగానే రాహువుచే మింగబడి మరల విడువబడిన చంద్రుని వలె గజేంద్రుడు
బడలిక
విడచిన దేహముతో తన తోటి ఏనుగులతో చేరి విన సొంపుగా ఘీంకారము చేసినది..

31, ఆగస్టు 2011, బుధవారం

బాపుబొమ్మల హరివిల్లు - లీలాజనార్దనం

లీలాజనార్దనం
కందుకూరి రుద్రకవి




పదహారవ శతాబ్దానికి చెందిన రుద్రకవి జనార్ధనాష్టకమును రచించారని పరిశోధకుల అభిప్రాయం.
శ్రీ కృష్ణదేవరాయలి ఆస్థానంలోని అష్టదిగ్గజాలలో ఇతనొకడని అంటారని నేను నెట్ లో తెలుసుకున్న సమాచారం.
వేమన పద్యాలకి వినురవేమ అని వున్నట్లు ఈయన రాసిన జనార్దనాష్టకం "కందుకూరి జనార్దనా" అంటూ ముగిసే ఎనిమిది పద్యాలు
నాకు ఈ జనార్దనాష్టకం ఎందుకు గుర్తుకు వచ్చిందంటే "బాపు బొమ్మల హరివిల్లు"
పుస్తకంలో ఈ జనార్ధనాష్టకంలోని అష్టవిధ నాయికలను బాపు గారు ఎంతో అందంగా చిత్రీకరించారు.
అందమైన నాయికలను వర్ణించిన ఆ జనార్ధనాష్టకానికి లీలాజనార్దనం అనే టైటిల్ తో బాపు వేసిన ఈ అష్టవిధనాయికల బొమ్మలు మరింత అందాన్ని ఆపాదించాయి..

స్వాధీనపతిక
చెప్పినట్లువిని,కోరినట్లు జరుపు మగడు కల స్త్రీ



సిరులు మించిన పసిమిబంగరు జిలుగుదుప్పటి జాఱఁగాఁ
జరణపద్మముమీఁద, దేహము చంద్రకాంతులు దేరఁగా
మురువుచూపఁగ వచ్చినావో మోహనాకృతి మీఱఁగా
గరుడవాహన! దనుజమర్దన! కందుకూరి జనార్దనా!

విప్రలబ్ద
చెప్పిన ప్రదేశానికి ప్రియుడు రాక మోసం చేయగా రాయబారం పంపిన స్త్రీ



ఆనపెట్టిన రాకపోతివి ఆయెఁబో అటుమొన్ననూ
పూని పిలువఁగ వినకపోతివి పొంచిపోవుచు మొన్ననూ
నేను చూడఁగఁ గడచిపోతివి నీటుచేసుక నిన్ననూ
కానిలేరా, దనుజమర్దన! కందుకూరి జనార్దనా!

విరహోత్కఠిత
సంకేత స్థలమునకు ప్రియుడు రానందున విరహముచే చింతించు స్త్రీ



నిన్నరాతిరి చవికెలోపల నీవుచెలి కూడుంటిరా
ఉన్నమార్గము లన్నియును నే నొకతెచేతను వింటిరా
విన్నమాత్రము కాదురా నిను వీధిలోఁగనుగొంటిరా
కన్నులారా, దనుజమర్దన! కందుకూరి జనార్దనా!

అభిసారిక
తనను తాను బాగా అలంకరించుకుని ప్రియుని కోసం సంకేత స్థలమునకు పోవు స్త్రీ



దబ్బు లన్నియుఁ దెలిసికొంటిని తప్పుబాసలు సేయకూ
మబ్బుదేరెడి కన్నుగవతో మాటిమాటికి డాయకూ
ఉబ్బుచేసుక తత్తఱంబున నొడలిపైఁ జెయివేయకూ
గబ్బితనమున, దనుజమర్దన! కందుకూరి జనార్దనా!

ఖండిత నాయిక
ప్రియునియందు పరస్త్రీ సంగమ చిహ్నములను చూసి అసూయపడు స్త్రీ



బిత్తరంబున మొలకకెంపులు పెదవి నెవ్వతె ఉంచెరా
గుత్తమైనమిటారిగుబ్బలగుమ్మ యెవ్వతె మెచ్చెరా
చిత్తగించక జీరువారను చెక్కి లెవ్వతె నొక్కెరా
కత్తిగోరుల, దనుజమర్దన! కందుకూరి జనార్దనా!

కలహాంతరిత
భర్తను అవమానించి తర్వాత పరితపించు స్త్రీ



అండబాయక కూడియుంటిమి ఆయెఁబోయెను నాఁటికి
ఖండిమండిపడంగ నేటికి? కదలు మెప్పటిచోటికి
ఉండరా నీమాటలకు నే నోర్వఁజాలను మాటికి
గండిదొంగవు దనుజమర్దన! కందుకూరి జనార్దనా!

ప్రోషిత పతిక
కార్యసిద్ధికై భర్త దేశాంతరము వెళ్ళగా ఆందోళనపడు స్త్రీ



అలుక లన్నియుఁ దీఱ నివు నాయండ కెప్పుడు వస్తివి
పిలిచి నవరత్నాలసొమ్ములు ప్రేమతో నెపుడిస్తివి
వలచి వలపించియును గూరిమి వదలకెప్పుడు మెస్తివి
కలసి వేడుక దనుజమర్దన! కందుకూరి జనార్దనా!

వాసక సజ్జిక
ప్రియుడు ఇప్పుడే వస్తాడని పడకగదినీ,తనను అలంకరించుకును స్త్రీ



జంటనేత్రములంటి చూచితె జాజిపూవులు పూచెరా
మింటిత్రోవను జూచుచుండఁగ మేఘవర్ణము గప్పెరా
కంటిలో నొకపండువెన్నెల కాయుచున్నది యేమిరా
కంటిలేరా! దనుజమర్దన! కందుకూరి జనార్దనా!

ప్రవత్యుత పతిక


మధ్యా - ధీర


అష్టవిధ నాయికలు మాత్రమే కాక బాపు లీలాజనార్ధనంలో
ప్రవత్యుత
పతిక, మధ్యా - ధీర
ఈ రెండుకూడా వున్నాయి.


Related Posts Plugin for WordPress, Blogger...