పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

17, అక్టోబర్ 2019, గురువారం

మా తమిళనాడు యాత్ర 2019 - ఇషా యోగా ఫౌండేషన్ - సద్గురు



ఇషా యోగా ఫౌండేషన్ - సద్గురు ఇప్పుడు  పరిచయం అక్కర్లేనంతగా అందరికీ తెలిసిపోయింది. కానీ నాకు తెలిసింది మాత్రం 2012 లో మా చెల్లి వాళ్ళు హైదరాబాద్ లో బిజినెస్ మ్యాన్ సినిమాకి వెళ్తే అక్కడ సద్గురు మెసేజెస్ వున్న CD ఇచ్చారని నాకు తెచ్చి ఇచ్చింది.ఆ CD లో చూసి గూగుల్ లో సెర్చ్ చేస్తే ఇషా ఫౌండేషన్ వెబ్సైట్ లో సద్గురు గురించి తెలిసింది.ఈ విషయం గురించి అప్పట్లో (2012)నా బ్లాగ్ లో కూడా బిజినెస్ మేన్ Vs సద్గురు అనే పోస్ట్ కూడా రాశాను. https://raji-rajiworld.blogspot.com/2012/01/vs.html

తమిళనాడు లోని కోయంబత్తూర్ లో వున్న ఇషా ఫౌండేషన్ లో నాకు అన్నిటికన్నా నచ్చింది ధ్యాన లింగం, లింగ భైరవి అమ్మవారు . ఎప్పటికైనా ఒక్కసారి వెళ్లి దర్శనం చేసుకోవాలని అప్పటినుండి అనిపించేది. ఆతర్వాత 2016 లో తమిళనాడు వెళ్లినా మాకు కోయంబత్తూర్ వెళ్ళటం కుదరలేదు. 

2017 లో ఆదియోగి విగ్రహం ప్రతిష్టించి,ప్రతి శివరాత్రికి అక్కడ జరిగే ప్రోగ్రామ్స్ చూస్తూ అనుకునేదాన్ని ఆదియోగి దర్శనం ఎప్పుడో అని.. మాకు ఆ దర్శనభాగ్యం 2019 ఆగస్టు 12 న కలిగింది.కోయంబత్తూర్ లోని వెల్లంగిరి కొండల మధ్యలో ప్రశాంతమైన వాతావారణంలో కొలువైన ధ్యానలింగం,లింగభైరవి, ఆదియోగి దర్శనం నిజంగా చాలా సంతోషాన్ని కలిగించింది.



అమ్మ, తమ్ముడు,నేను ఆదియోగి దగ్గర
 

 ఇషా లో మేము ..
Travel With Naa chinni Prapancham



ఆదియోగి దివ్యదర్శనం




Related Posts Plugin for WordPress, Blogger...