పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

15, నవంబర్ 2011, మంగళవారం

ఛత్రపతి శివాజీ స్ఫూర్తికేంద్రం - శ్రీశైలం

1677 సంవత్సరంలో శ్రీశైలంలో ఇప్పటి శివాజీ ద్యానమందిరం ఉన్న ప్రదేశంలో
హిందూ సామ్రాజ్య నిర్మాత శివాజీ మహారాజ్ చే నిర్మాణము చేయబడిన ధ్యాన మందిరం వుండేది.
ఇక్కడ నివసిస్తూ తపస్సు చేసి అమ్మవారిని ధ్యానించగా విదేశీ ముస్లింల దురాక్రమణను ఎదుర్కొని హిందువులను,హిందువుల ఆలయాలను,గ్రంధాలను,హిందూ ఆచారాలను రక్షించమని ఆదేశిస్తూ
శ్రీ భ్రమరాంబికా అమ్మవారు ప్రత్యక్షమై శివాజీ మహారాజ్ ని ఆశీర్వదించి దివ్య ఖడ్గాన్ని బహుకరించినది.
శివాజీ మహారాజ్ ప్రార్ధన చేసిన ధ్యాన మందిరం శిధిలమై పోయినందున అదే స్థలములో
శివాజీ
స్ఫూర్తి కేంద్రం పేరుతో 1983 సంవత్సరములో భూమి పూజ జరిగి 1994 లో
నూతన భవనం ప్రారంభమైనది..
15,000 చదరపు అడుగుల నిర్మాణం,27 అడుగుల ఎత్తు, 10,000 చదరపు అడుగుల్లో
54 స్తంభాలు గల దర్బార్ హాల్,
12 అడుగుల ఎత్తైన ఛత్రపతి శివాజీ మహారాజ్ కాంస్య విగ్రహం ఇక్కడ ప్రత్యేకత..
శివాజీ స్ఫూర్తి కేంద్రం

12 అడుగుల ఎత్తైన ఛత్రపతి శివాజీ మహారాజ్ కాంస్య విగ్రహం
శివాజీ జీవిత చరిత్రను తెలియచేసే చిత్ర ప్రదర్శనలోని కొన్ని చిత్రాలు:
సంతానార్ధియైన జిజియాబాయి
శివాజీ మహారాజ్ జననం
కస్పాగణపతి మందిరంలో శివాజీకి విద్యాభ్యాసము
తల్లి దీవెనలతో,నీతి బోధలతో ఎదిగిన ఛత్రపతి..
భవిష్యత్తులో ఛత్రపతిగా వికసించటానికి బాల్యంలోనే శిక్షణ
ఛత్రపతి స్వరాజ్య స్థాపన
శివాజీ మహారాజ్ కి భవానీమాత ఖడ్గం ప్రసాదించుట
శివాజీ ఖడ్గం - వాస్తవం
శివాజీ స్ఫూర్తికేంద్రం ప్రధానద్వారం
Related Posts Plugin for WordPress, Blogger...