పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

23, ఏప్రిల్ 2020, గురువారం

స్కందాశ్రమం - విరూపాక్ష గుహ - తిరువణ్ణామలై





భగవాన్ శ్రీ రమణ మహర్షి 1899 నుండి 1916 వరకు విరూపాక్ష గుహలోనూ,1916 నుండి 1922 వరకు స్కందాశ్రమంలోనూ నివసించారు.ఆయన తల్లిగారైన అళగమ్మాల్ తో కలిసి జీవించిన స్కందాశ్రమానికి చేరే దారి ఇప్పటి రమణాశ్రమం వెనకవైపు నుండి ఉంటుంది. 1.4 kms కొండపైకి వెళ్తే ఈ ఆశ్రమ చూడొచ్చు.ఆశ్రమానికి వెళ్ళడానికి నడిచే దారంతా చాలా నిశ్శబ్ధంగా పక్షుల శబ్ధాలు,పచ్చని అడవి, అందమైన నెమళ్ళ నడకలతో  ఆహ్లాదకరంగా ఉంటుంది.

 

తిరువణ్ణామలైగా పిలిచే అరుణాచలంలో శ్రీరమణ  మహర్షి  గుడిలో, గిరి గుహలలో పలుచోట్ల నివాసముంటూ చివరగా  అరుణగిరి దక్షిణపాదంలో స్థిరపడగా అదే ఇప్పుడు  శ్రీరమణాశ్రమంగా రూపుదిద్దుకొంది.1896 సెప్టెంబర్‌ 1న అరుణాచల ఆగమనం నాటినుంచి ఏప్రిల్‌ 14, 1950 వరకు – సుమారు 54 సం.లపాటు వారికి అత్యంత ప్రియమైన అరుణగిరి పొలిమేర దాటిపోలేదు.

స్కందాశ్రమానికి వెళ్ళే దారిలో చెక్కుతున్న బొమ్మలు

ఆశ్రమానికి వెళ్ళే దారిలో అందంగా,స్వేచ్ఛగా 
తిరుగుతున్న నెమళ్ళు

శ్రీ రమణులు అన్ని చోట్లకంటే ఎక్కువగా విరూపాక్షగుహలో  17 సంవత్సరాలు ఉన్నారు. తొలినాళ్ళలో స్వామి చాలావరకు మౌనంగా ఉండేవారు. అప్పటికే వారిచుట్టూ జిజ్ఞాసువుల, సేవక భక్తుల బృందం ఏర్పడింది. పిల్లలు, పెద్దలు కడకు జంతువులతో సహా హృదయ మధురమైన దృశ్యం ఏమంటే, ఊళ్ళోని చిన్నవాళ్ళు సైతం శ్రమకోర్చి కొండెక్కి విరూపాక్షగుహవద్ద వున్న స్వామిని చేరి, కొంత తడవు వారివద్ద కూచొని, సరదాగా ఆడుకొని, తాయిలాలను ఆనందాన్ని పంచుకొని, తిరిగి వెళ్ళేవారు. వారికి స్వామి తమలో ఒకరు. ఉడుతలు, కోతులు వచ్చి వారి చేతినుంచి ఆహారాన్ని స్వీకరించేవి. ఇలాటి అద్భుత దృశ్యాలెన్నో..



1916లో తిరువణ్ణామలై వచ్చిన రమణుల తల్లి  "అళగమ్మ"
రమణుల దగ్గరే ఉండటానికి నిర్ణయించుకున్నారు.ఆశ్రమంలో ఉన్న కొందరికి ఆమె ఆహారం వండిపెట్టేవారు.త్వరలోనే కొడుకు నాగసుందరం కూడా తల్లిబాట పట్టాడు.వీరందరూ రావటంతో  రమణులు తమ నివాసాన్ని విరూపాక్ష గుహ నుంచి స్కందాశ్రమానికి మార్చారు.కందస్వామి అనే రమణుల శిష్యునిచే ఈ ఆశ్రమం స్థాపించబడినది ఆశ్రమ భవనము యొక్క ముఖ్య భాగం నిర్మాణానికి కుడా ఆయనే చొరవ చూపించారు. ఈ ఆశ్రమంలో రమణమహర్షి 1922  వరకు నివసించారు

విరూపాక్ష Cave / స్కందాశ్రమం Travel Vlog 
10 - August - 2019





12, ఏప్రిల్ 2020, ఆదివారం

రమణ మహర్షి ఆశ్రమం / రమణాశ్రమం - తిరువణ్ణామలై 10 -August - 2019






శ్రీ రమణాశ్రమం
తమిళనాడులోని  ‘తిరువణ్ణామలై’ గా పిలువబడే అరుణాచలంలో భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆశ్రమం వుంది.9 august 2019 లో అత్తి వరదరాజస్వామి దర్శనం చేసుకున్న తరవాత రోజు ఉదయాన్నే అరుణాచలేశ్వరుని దర్శనం తర్వాత రమణమహర్షి 1922 నుండి 1950 వరకు నివసించిన శ్రీ రమణాశ్రమానికి  వెళ్ళాము.ఆశ్రమం విశేషాలు,వివరాలు రమణమహర్షి  ఆశ్రమం ప్రచురణల సహాయంతో నా చిన్నిప్రపంచంలో .. 


బెంగళూరు రోడ్డులో కుడిపక్కగా వున్న ఆశ్రమం వద్ద శ్రీరమణాశ్రమం అని రాసివున్న కమాన్‌ (గేట్‌పైన ఆర్చ్‌) లోంచి ఆశ్రమంలో ప్రవేశించగానే సువిశాలమైన ప్రాంగణంలో అడుగుపెడతారు.నాలుగువందల సంవత్సరాల విప్పచెట్టుతో సహా మామిడి, బాదం తదితర మహావృక్షాల నీడతో పురాతనమైన వాతావరణమేదో స్ఫురిస్తుంది. ఈ ఆవరణ ప్రతి ఉదయం 10.30కు నారాయణసేవతో కళకళలాడుతుంది. ఎదురుగా మెట్లు, తరువాత ఎడమపక్క రెండు గోపురాలు. మొదటిది భగవానుల మాతృమూర్తి సమాధి సన్నిధి శ్రీమాతృభూతేశ్వరాలయం.రెండవది భగవాన్‌ శ్రీరమణ మహర్షుల సన్నిధి శ్రీరమణేశ్వరాలయం.



కొత్త హాల్ 
 తూర్పు ముఖద్వారంగల మాతృభూతేశ్వరాలయంలో ప్రవేశిస్తే మొదట ‘కొత్త హాల్‌’ అందులో కుడిపక్క దక్షిణాభిముఖంగా, చక్కగా చేయబడిన రాతిసోఫాలో పద్మాసనంలో కూచున్న శ్రీభగవాన్‌ల రాతివిగ్రహం. పెరుగుతున్న భక్తుల వసతికోసమై నిర్మించబడిన ఈ కొత్త హాల్‌లో స్వామి మహానిర్వాణానికి ముందు కొద్ది నెలల కాలం నివాసమున్నారు.

ఉదయం 5-12.30; మధ్యాహ్నం 2-9 తెరచి ఉంచుతారు





మాతృభూతేశ్వర ఆలయం

కొత్త హాల్‌లో పడమరగా ఉన్న రెండో పెద్దద్వారం శ్రీమాతృభూతేశ్వర మహాసన్నిధానానికి దారితీస్తుంది. ప్రఖ్యాత శిల్పి వైద్యనాథ స్థపతి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ అద్భుత నిర్మాణం రూపుదిద్దుకొంది. గర్భగృహంలో శ్రీమాతృభూతేశ్వర లింగం, గోడలో అమర్చిన శ్రీచక్ర మహామేరు యంత్రం, మరో భూప్రస్థార యంత్రం భగవానుల స్పర్శతో పునీతమై దర్శినమిస్తాయి. నవావరణ విధాన శ్రీచక్ర పూజ ప్రతి శుక్రవారం, పౌర్ణమి, తమిళ మాసాల మొదటిరోజున సాయంత్రం 6 గం. మొదలై, 3 గం. పాటు సాగుతుంది. గర్భాలయం గోడల వెలుపల దక్షిణామూర్తి, లింగోద్భవ మూర్తి, అక్ష కమండలు ధారి బ్రహ్మ, యోగాంబిక దర్శనమిస్తారు. నైఋతి, వాయువ్య మూలలలో గజానన, షడానన సన్నిధులున్నాయి. ఉత్తరాన సోమసూత్రానికి ఎదురుగా చండికేశ్వరుని సన్నిధి ఉంది. ఈశాన్యంలో నవగ్రహ మండపం, పక్కనే నటరాజ, శివకామనాయికిల పంచలోహ మూర్తులున్నాయి. పై కప్పుకు ఆధారంగా ఉన్న రాతిస్తంభాలపై దేవీదేవతల విగ్రహాలు, ద్వారానికి ఇరుపక్కల పశ్చిమ ముఖంగా సూర్యచంద్రులు, గర్భాలయం ఎదురుగా పెద్దవేదికపై కొలువైన శ్రీనందికేశ్వరుడు విరాజమానమై ఉన్నారు.
ఉదయం 5 – 12.30, మధ్యాహ్నం 3.30 – 8 వరకు తెరచి ఉంటుంది.


రమణుల సమాధి
మాతృభూతేశ్వర ఉత్తరద్వారంనుంచి మహర్షుల సమాధి మందిరంలోకి ప్రవేశిస్తాము. సన్నిధిలో మండపం, దానికి ఆచ్ఛాదనగా విమానం ఉన్నాయి. 4 గ్రానైట్‌ స్తంభాలీ విమానానికి ఆధారం. మండపం మధ్యలో పాలరాతి పద్మం, దానిమధ్యలో శివలింగం – శ్రీరమణేశ్వర మహాలింగం దివ్య తేజోమయంగా, ప్రసన్న జ్ఞాన కిరణాలను వెదజల్లుతూ, సందర్శకులలో మహద్భక్తి భావాన్ని ఆవిష్కరించే విధంగా దర్శనమిస్తుంది. ఈ మండపం చుట్టూతా, ఇంకా హాలులోను రమణుల పెద్ద పెద్ద ఫొటోలు సజీవమూర్తులై దీవిస్తాయి. 300మంది కూర్చోగల ముందుహాల్‌ కడప-చలువరాళ్ళతో ప్రకాశిస్తూంటుంది
ఉదయం 5 – 12.30, మధ్యాహ్నం 2 – 9 వరకు తెరచి ఉంటుంది.


పాతహాల్
సమాధిహాల్‌ ఉత్తరద్వారంలోంచి నిర్గమిస్తే పెద్దనుయ్యి ‘అఘశమన’ లేక ‘రమణ’తీర్థం ఉంది. శ్రీరమణుల మహిమా ప్రసాదమైన ఈ జలాలను అభిషేకాదులకు వినియోగిస్తారు. ఎడమపక్కగా ఉన్నది పాతహాల్‌ లేక ధ్యాన మందిరం. భగవాన్‌ శ్రీరమణులు అత్యధిక భాగం ఈ హాల్‌లో సోఫాపై ఆసీనులై దర్శన, సత్సంగములను ప్రసాదించేవారు. ఆబ్రహ్మకీటక పర్యంతం అనేకులు వారిని దర్శించి, వారితో సంభాషించి, వారి అనుగ్రహానికి పాత్రులైనది ఇక్కడే. నేటికీ ఈ స్థానం సాధకులకు స్ఫూర్తిప్రదాయినిగా, సందర్శకులకు శాంతిప్రదాత్రిగా విరాజిల్లుతోంది.




ఈ హాలుకి ఉత్తరంగా చిన్నగోడ దాటగానే కొంత ఆవరణ, కొంత ఎత్తులో స్వామి స్పర్శదీక్షతో ముక్తిపొందిన కాకి, కుక్క, గోవు లక్ష్మి – మొదలైన జంతువుల సమాధులున్నాయి. గోలక్ష్మికి ప్రతి శుక్రవారం 7-15కు పూజాభిషేకాలు జరుగుతాయి. ఎడమపక్క బిల్డింగ్‌ – పాత డిస్పెన్సరీ హాల్‌, దాని నానుకొని పూదోట. సమాధుల వెనుక కొండపైనున్న స్కందాశ్రమానికి దారితీసే మెట్లు, వాటికి ఎడమపక్కన మురుగునార్‌ మొదలైన భక్తుల సమాధులు కన్పిస్తాయి.


గోశాల
భగవాన్‌ ఆదరానుమతితో ఆశ్రమ ప్రవేశం చేసిన గోవు లక్ష్మి సంతతి, తదితర గోమాతల పాడితో దినదినాభివృద్ధి చెందినది ఆశ్రమ గోశాల. ప్రస్తుతం నూటికిపైగా గోసంతతి అందించే పాడియే అందరికీ పోషకామృతం.



నిర్వాణగది
శ్రీమాతృభూతేశ్వరాలయానికి తూర్పున, ఆఫీసు గదులకు ఉత్తరంగాను చిన్నగది సర్వాలంకార శోభితంగా ఏదో ప్రత్యేకత ఉన్నట్లు తేజరిల్లుతుంటుంది.రమణుల అవసాన కాలం మరియు వారి మహానిర్వాణానికీ, ఈ గది వేదిక అయింది. ఇందులో వారిచే తయారుచేయబడిన, వారికి భక్తులు సమర్పించుకొన్న అనేక నిత్యవాడక వస్తువులు, తదితరాలు మెరుస్తూ కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.





పుస్తకాలయము
తెలుగు, ఇంగ్లీషు, తమిళం తదితర భాషల్లో శ్రీరమణులకు సంబంధించిన పుస్తకములు; వారిచే వ్రాయబడినవి; తెలుగు, ఇంగ్లీష్‌, తమిళం తదితర భాషల్లో శ్రీరమణులకు సంబంధించిన పుస్తకములు; వారిచే వ్రాయబడినవి, జీవిత చరిత్రలు, వ్యాఖ్యానాలు స్మృతులు లభిస్తాయి. ఇంకా ఫోటోలు, ఆడియో, వీడియో టేప్‌ – సిడి-డివిడిలు, జ్ఞాపికలు. ద మౌంటెన్‌ పాత్‌ అనే త్రైమాస పత్రిక ఇంగ్లీషులో ప్రచురణ.
ఉదయం 7.30-11, మధ్యాహ్నం 2.30.- 6.30 తెరచి ఉంటుంది.









 
శ్రీ రమణాశ్రమం Travel Vlog 
10 - August - 2019








17, అక్టోబర్ 2019, గురువారం

మా తమిళనాడు యాత్ర 2019 - ఇషా యోగా ఫౌండేషన్ - సద్గురు



ఇషా యోగా ఫౌండేషన్ - సద్గురు ఇప్పుడు  పరిచయం అక్కర్లేనంతగా అందరికీ తెలిసిపోయింది. కానీ నాకు తెలిసింది మాత్రం 2012 లో మా చెల్లి వాళ్ళు హైదరాబాద్ లో బిజినెస్ మ్యాన్ సినిమాకి వెళ్తే అక్కడ సద్గురు మెసేజెస్ వున్న CD ఇచ్చారని నాకు తెచ్చి ఇచ్చింది.ఆ CD లో చూసి గూగుల్ లో సెర్చ్ చేస్తే ఇషా ఫౌండేషన్ వెబ్సైట్ లో సద్గురు గురించి తెలిసింది.ఈ విషయం గురించి అప్పట్లో (2012)నా బ్లాగ్ లో కూడా బిజినెస్ మేన్ Vs సద్గురు అనే పోస్ట్ కూడా రాశాను. https://raji-rajiworld.blogspot.com/2012/01/vs.html

తమిళనాడు లోని కోయంబత్తూర్ లో వున్న ఇషా ఫౌండేషన్ లో నాకు అన్నిటికన్నా నచ్చింది ధ్యాన లింగం, లింగ భైరవి అమ్మవారు . ఎప్పటికైనా ఒక్కసారి వెళ్లి దర్శనం చేసుకోవాలని అప్పటినుండి అనిపించేది. ఆతర్వాత 2016 లో తమిళనాడు వెళ్లినా మాకు కోయంబత్తూర్ వెళ్ళటం కుదరలేదు. 

2017 లో ఆదియోగి విగ్రహం ప్రతిష్టించి,ప్రతి శివరాత్రికి అక్కడ జరిగే ప్రోగ్రామ్స్ చూస్తూ అనుకునేదాన్ని ఆదియోగి దర్శనం ఎప్పుడో అని.. మాకు ఆ దర్శనభాగ్యం 2019 ఆగస్టు 12 న కలిగింది.కోయంబత్తూర్ లోని వెల్లంగిరి కొండల మధ్యలో ప్రశాంతమైన వాతావారణంలో కొలువైన ధ్యానలింగం,లింగభైరవి, ఆదియోగి దర్శనం నిజంగా చాలా సంతోషాన్ని కలిగించింది.



అమ్మ, తమ్ముడు,నేను ఆదియోగి దగ్గర
 

 ఇషా లో మేము ..
Travel With Naa chinni Prapancham



ఆదియోగి దివ్యదర్శనం




22, సెప్టెంబర్ 2019, ఆదివారం

మాకు లభించిన అరుదైన శ్రీ అత్తి వరదరాజస్వామి దర్శనం 2019



తమిళనాడులోని కాంచీపురం - కంచి దాదాపు అందరికీ బాగా తెలిసిన ఆలయం.కంచి కామాక్షమ్మతో పాటు ఇక్కడ విష్ణు కంచిగా పిలుచుకునే వరదరాజ పెరుమాళ్ ఆలయం కూడా 108 దివ్యదేశాలలో ఒకటైన  పురాతన విష్ణు ఆలయం. బంగారు బల్లి,వెండి బల్లి ఉన్న ఆలయంగా ప్రసిద్ధి కూడా.మేము 2011 ,2016 రెండుసార్లు వరదరాజ పెరుమాళ్ దర్శనం చేసుకున్నాము.ఈ ఆలయంలో గర్భాలయంలో ఉన్న వరదరాజస్వామిని మహావిష్ణువు అవతారంగా భక్తులు విశ్వసిస్తుంటారు.వరదరాజ పెరుమాళ్‌గా కొలుస్తుంటారు. శ్రీవరదరాజ స్వామి "వరములను ద అనగా ఇచ్చునట్టి శ్రీ నారాయణుడు"


 శ్రీ అత్తి వరదరాజ స్వామి చరిత్ర :
ఈ ఆలయంలో మొన్నటివరకు మాకు తెలియని విశేషం 40 సంవత్సరాలకు ఒకసారి ఉండే "అత్తివరదరాజ స్వామి దర్శనం" 9 అడుగుల పొడవు ఉండే  అత్తి వరదరాజస్వామి విగ్రహాన్ని స్వయంగా  బ్రహ్మదేవుని ఆదేశంతో దేవశిల్పి విశ్వకర్మ అత్తిచెట్టు కాండంతో తయారుచేసినట్లు పురాణాలు చెప్తున్నాయి.పూర్వం వరదరాజ పెరుమాళ్ ఆలయంలో ప్రధాన దైవంగా అత్తివరదరాజ స్వామి  ఎన్నో యుగాలుగా పూజలు అందుకుంటున్న సమయంలో 16వ శతాబ్దంలో కాంచీపురంపై జరిగిన దండయాత్రలో దేవాలయాలను కూల్చి సంపదలను దోపిడి చేస్తుండగా  స్వామివారి విగ్రహానికి హాని కలుగకుండా ఆలయంలోని ఆనంద పుష్కరిణి లో నీరాళి మంటపం పక్కగా చిన్నమండపం యొక్క అడుగు భాగంలో ,లోపలికి నీళ్లు చేరని విధంగా జాగ్రత్తలు తీసుకుని వెండి పెట్టెలో ఉంచి కోనేటి అడుగున భద్రపరిచారు.


ఆలయంలో మూలవిరాట్ లేకపోవటంతో ఇప్పుడు ఆలయంలో వున్న వరదరాజ స్వామిని ప్రధాన ఆలయంలో ప్రతిష్టించారు.కొన్నాళ్ళ తర్వాత కోనేరు ఎండిపోవడంతో అత్తి వరదరాజస్వామి ప్రధాన విగ్రహం బయటపడింది. అత్తిచెట్టు కాండంతో చేసిన ఆ విగ్రహం ఎన్నో ఏళ్లు నీటిలో ఉన్నా ఏమీ కాకపోవటంతో దాన్ని తిరిగి ప్రతిష్టించారు.తర్వాత 48 రోజుల పాటు పూజలు  నిర్వహించి మళ్లీ కోనేరులో భద్రపరిచారు. తర్వాత ఇదో సంప్రదాయంగా మారింది.అప్పటి నుంచి పుష్కరిణి  అడుగున భద్రపరిచిన విగ్రహాన్ని 40 ఏళ్లకు ఒకసారి బయటకు తీసి వసంత మండపంలో ఉంచి 48 రోజులపాటు  భక్తులకు దర్శనం కల్పించి మళ్లీ కోనేరులో భద్రపరుస్తున్నారు.ఇలా 1854 నుంచి చేస్తున్నట్లు అప్పటి వార్తా పత్రికల కథనాల ఆధారంగా తెలుస్తోంది.

1892, 1937 లో,చివరిగా 1979 లో దర్శనం ఇచ్చిన శ్రీ అత్తి వరదరాజ స్వామి ఈ సంవత్సరం అంటే 2019 జులై 1 వ తేదీ నుండి ఆగస్ట్17 వ తేదీ వరకు దర్శనం ఇచ్చారు. ఈ గుడికి సంబంధించి దాదాపు 362 వరకు కాకతీయులు, తెలుగు చోళులకు చెందిన రాత ప్రతులు లభించాయి.వీటి ఆధారంగా ఆలయ చరిత్ర తెలుస్తుందని చెప్తున్నారు.



ఈ సంవత్సరం అంటే 2019 జులై 1 వ తేదీ నుండి ఆగస్ట్17 వ తేదీ వరకు  అత్తివరదరాజ స్వామి దర్శనం జరిగింది. మొదటి 38 రోజులు శయన(పడుకున్న) భంగిమలోను చివరి 10 రోజులు స్థానక (నిలుచున్న) భంగిమలోను స్వామి దర్శనం, ఉచిత దర్శనంతో పాటు 50రూపాయల టికెట్ దర్శనం,ఉదయం 11 to 12 వరకు సాయంత్రం 7 to 8 వరకు రెండు పూటలు స్వామికి సహస్రనామార్చన ఇవీ ఆలయం  ప్రకటించిన స్వామివారి దర్శనం వివరాలు. అత్తివరదరాజ స్వామి దర్శనం గురించి పేపర్లు,టీవీలు మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ప్రచారం జరిగింది.1979 లో, ఇప్పుడు  2019,మళ్ళీ 2059  లో అంటే 40 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కలిగే అరుదైన దర్శనం కాబట్టి రికార్డు స్థాయిలో భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారట.జూన్‌ నెలాఖరున వరదరాజపెరుమాళ్‌ ఆలయంలో అనంతసరస్సులోని నాలుగుకాళ్లమంటపం దిగువనున్న చిన్నగది నుంచి అత్తివరదర్‌స్వామిని ఆలయ భట్టాచార్యులు భుజాలపై మోసుకొచ్చి వసంతమండపంలో ఉంచిన తర్వాత,జూలై ఒకటి నుంచి 31 రోజులపాటు శయనభంగిమలో సర్వాలంకరణ శోభితులై అత్తివరదర్‌స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. ఆ తర్వాత ఆగస్టు 1 నుండి  17 వరకు నుంచి స్వామివారు నిల్చున భంగిమలో భక్తవరదుడిలా అభయప్రదాతగా భక్తులకుదర్శనం ఇచ్చారు. 


మా అత్తివరదరాజ స్వామి దర్శనం విశేషాలు 
స్వామి విశేషాలన్నీ తెలిశాక మాకు కూడా అత్తివరదరాజ స్వామిని చూడాలనిపించింది.ముఖ్యంగా మా అమ్మ , నాన్న కోసం కష్టమైనా సరే స్వామి దర్శనానికి వెళ్ళాలి అనుకున్నాము.ఆగస్టు 9 ఉదయాన్నే గుంటూరు నుండి బయల్దేరి,"తిరుత్తణి వేల్ మురుగన్" దర్శనం చేసుకుని, కంచి వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం 2 గంటలు అయింది. కంచికి చాలా దూరంలోనే బయటి వాహనాల పార్కింగ్ ఉంది.అక్కడి నుండి తమిళనాడు బస్సులు,ఆటోల్లో ఆలయం దగ్గరికి తీసుకెళ్తున్నారు.మేము కొంచెం ప్రయత్నించి,మా కార్లోనే  దర్శనానికి మొదలయ్యే క్యూలైన్ దగ్గర్లోకి వెళ్ళాము.దగ్గరగా వెళ్ళాక అక్కడ గుట్టలుగా పడివున్న చెప్పులు చూడగానే మా అందరికీ భయం మొదలైంది.ఆ చెప్పులన్నీ అంతకుముందు క్యూలైన్స్ లో జరిగిన తొక్కిసలాటలో వదిలేసిన భక్తులవట.



దర్శనానికి 3 గంటలు పడుతుందని అప్పటికే వెళ్ళివచ్చే వాళ్ళు చెప్తున్నారు.సరేనని ధైర్యం చేసి క్యూలైన్లోకి వెళ్ళాము.ఆలయానికి చాలా దూరంనుండే క్యూ మొదలయ్యింది.ఎటువైపుచూసినా పోలీస్ బందోబస్తు మధ్య క్యూలైన్ ఉంది.ఆలయానికి ఎటువైపు నుండి క్యూ మొదలయిందో కూడా తెలియకుండా ఎటెటో తిప్పుతూ చెక్కలతో క్యూలైన్స్ ఏర్పాటు చేశారు.మంచినీళ్లు, ప్రసాదాలు పంచుతున్నారు.



ఒక్కసారి క్యూలో ఆగిపోతే మనముందే వందమంది ముందుకెళ్ళేలా జనాలు వున్నారు.అంతసేపు క్యూలైన్లో నిలబడటం,అంతదూరం జనాల్లో నడవటం నిజంగా చాలా కష్టం అనిపించినా, అరుదైన స్వామి  దర్శనం కలుగుతుందన్న ఆనందం ముందు ఆ కష్టం చిన్నదే అనిపించింది.మేమందరం తట్టుకున్నాము కానీ మా అమ్మకి B.P. ఉండటంవలన కళ్ళు తిరిగి కాస్త ఇబ్బందిపడింది.క్యూలైన్లలో పిల్లలు,పెద్దవాళ్ళు బాగానే కష్టపడ్డారు.
 
మా అమ్మ,తమ్ముడు,నేను

సుమారు అయిదుగంటలు క్యూలైన్లో నిల్చుని,నడిచిన తర్వాత స్వామివారు వున్న వసంతమండపం దగ్గరికి వచ్చాము.అందమైన అలంకరణతో,అభయముద్రతో నిలుచుని వరాలని ప్రసాదించే అత్తివరదుని దగ్గరినుండి దర్శనం చేసుకున్నామ.40 సంవత్సరాలకు  ఒకసారి,మనిషి  జీవితంలో ఒకసారి లేదా రెండుసార్లు మాత్రమే కలిగే అరుదైన స్వామివారి దర్శనం మాకు లభించటం చాలా అదృష్టం, చాలా సంతోషంగా  అనిపించింది.


ప్రధాన ఆలయంలో దర్శనాలేమీ లేవని చెప్పారు.బయటికి వచ్చాక కూడా పోలీసులు భక్తుల్ని ఎక్కడా ఆగకుండా పంపిస్తున్నారు.వాళ్ళు అలా చేయటం వల్లనే లక్షల సంఖ్యలో వచ్చిన జనాన్ని మేనేజ్ చేయగలిగారు అనిపించింది.బయట అత్తివరదరాజస్వామి వివిధ అలంకారాల్లో తీసిన ఫోటోలు లామినేషన్ చేపించి అమ్ముతున్నారు.అక్కడ కూడా భక్తులు పోటీపడి మరీ వాటిని కొంటున్నారు.మేము కూడా ఆ ఫోటోలు కొనుక్కుని,కంచి కామాక్షమ్మ దర్శనానికి బయలుదేరాము.


కొన్ని విశేషాలు 
ఆలయం చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు ఇళ్ళముందే వాటర్ బాటిల్స్,కూల్ డ్రింక్స్,టీలు,స్నాక్స్ ఇలా తాత్కాలికంగా బిజినెస్ ఏర్పాట్లు చేసుకున్నారు.
ఆటోల వాళ్ళు ఊరిబయట ఆపేసిన పార్కింగ్ దగ్గరినుండి గుడిదగ్గరికి ఒక్కొక్క మనిషికి 150,ఇంకా ఎక్కువ కూడా తీసుకున్నారట.దర్శనం తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు ఇంకా ఎక్కువ డబ్బు కూడా డిమాండ్ చేశారని చాలా మంది చెప్పుకున్నారు.
క్యూలైన్లో భక్తులు తినిపారేసిన ప్రసాదం డొప్పలు ఎప్పటికప్పుడు క్లీన్ చేయక,కొన్ని చోట్ల క్యూ లైన్లో నిలబడటం కూడా ఇబ్బంది అయ్యింది.
అత్తివరదరాజ స్వామిదర్శనం తమిళనాడు మొత్తాన్ని భక్తులతో నింపేసింది అరుణాచలం మొదలుకుని,తంజావూర్,చిదంబరం ఇలా అన్నిచోట్లా విపరీతమైన జనాలు వున్నారు.ఎక్కడికి వెళ్లినా మీకు అత్తివరదరాజ స్వామి దర్శనం అయ్యిందా అని అడిగేవారు.ఎక్కువగా ఆంధ్రా వాళ్ళు కనపడ్డారు.

ఇవీ మా చిన్నిప్రపంచంలో 2019 లో ఎప్పటికీ గుర్తుండే సంతోషకరమైన "అత్తివరదుని" దర్శనవిశేషాలు 
ఓం నమో నారాయణాయ

అత్తివరదరాజ దర్శనం 



15, మార్చి 2019, శుక్రవారం

The All India Federation Of Women Lawyers Seminar @ Guntur


Happy To Participate in One Day Seminar On 
"Uniform Civil Code"
At Nagarjuna University. Amaravathi A.P., 
10th March,2019

As a Member of  The All India Federation Of Women Lawyers & Federation Of Women Lawyers,A.P


Seminar On 
"Uniform Civil Code" 




26, ఫిబ్రవరి 2019, మంగళవారం

బంతి..చామంతి ...




బంతి చామంతి పూలతోటలు
మా గుంటూరు జిల్లాలో..



Thanks For Watching
Please Like & Subscribe  My Youtube Channel

26, డిసెంబర్ 2018, బుధవారం

మా గుంటూరు కూరగాయల మార్కెట్ / 🌽 Vegetable Market Tour 🌽 @ My Guntur..



మా గుంటూరు కూరగాయల మార్కెట్
 🌽 Vegetable Market Tour 🌽 @ My Guntur..






11, డిసెంబర్ 2018, మంగళవారం

శ్రీ ఛాయా సోమేశ్వరాలయం, నల్గొండ - పానగల్లు


శ్రీ ఛాయా సోమేశ్వరాలయం నల్గొండ - పానగల్లు 
Ancient & Mysterious Sri Chaya Someswara Temple



శ్రీ ఛాయా సోమేశ్వరాలయం తెలంగాణా రాష్ట్రం నల్గొండ  జిల్లాలోని పానగల్లు గ్రామంలో ఉంది.నల్గొండ నుండి 5 K.M దూరంలో పానగల్లు గ్రామం చివరిలో,పచ్చని పంటపొలాల మధ్య ఆలయం ఉంటుంది.

తెలంగాణా ప్రాచీన నగరంలో ఒకటైన పానగల్లు పట్టణం క్రీ. శ 11 - 12 శతాబ్దంలో కుందూరు చోళరాజుల రాజధానిగా ఉండేది..కాకతీయులకు సామంతులైన ఈ కుందూరు చోళులు తమ ఆరాధ్యదైవమైన పరమేశ్వరునికి ఈ ఛాయా సోమేశ్వరాలయాన్ని,పచ్చల సోమేశ్వరాలయాన్ని నిర్మించారు.ఈ ఆలయంలో లభించిన పురాతన శాసనాల ప్రకారం కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుడు కూడా ఆలయ అభివృద్ధికి కృషి చేశారని తెలుస్తుంది. 

ఈ ఆలయాన్ని త్రికూటాలయం అని కూడా పిలుస్తారు.తూర్పుముఖంగా వున్న గర్భగుడిలోని శివలింగంపైన రోజంతా ఒక స్తంభాకారలోని నీడ పడుతూ ఉంటుంది .ఇదే ఛాయా సోమేశ్వరాలయం లోని  ప్రత్యేకత.ఎప్పుడూ నీడతో (ఛాయ)కప్పబడి ఉంటాడు కాబట్టి ఇక్కడ స్వామికి ఛాయా సోమేశ్వరుడనే పేరు వచ్చింది.సుమారు పది దశాబ్దాలు ఈ నీడ ఎలా వస్తుందో ఎవరికీ తెలియని మిస్టరీ ఈ ఆలయంలో వుంది అంటారు.కానీ ఈ మధ్య తెలంగాణకే చెందిన ఎవరో టీచర్  ప్రయోగాలు చేసి నీడ ఎలా వస్తుందో కనిపెట్టారని చెప్తున్నారు. 

ఆలయంలో ప్రధాన మండపంలో స్తంభాలు,వాటిపైన శిల్పకళ చాలా బాగుంటుంది.ఆలయ ప్రాంగణంలో శిధిలమైన నంది విగ్రహాలు ,మండపాలు కనిపిస్తాయి.మేము 2016 పుష్కరాల తర్వాత వెళ్ళాము.పుష్కరాలకు గుడిని కొంచెం సరిచేశారని చెప్పారు అక్కడి పూజారి.సోమేశ్వరాలయం  హైదరాబాద్ నుండి 100 K.M దూరంలో ఉంటుంది.

పానగల్లు గ్రామంలో ఉన్న మరో శివాలయం పచ్చల సోమేశ్వరాలయం.దీన్ని కూడా కుందూరు చోళులు నిర్మించారు. ఆలయంలో 70 స్తంభాల మండపం,స్తంభాల మీద రామాయణ,మహాభారత ఘట్టాలు,పురాణ పాత్రలు చూస్తున్నట్లుగానే అనిపించే పెద్ద నంది ఈ ఆలయ ప్రత్యేకతలు.

ఆలయ విశేషాలు ఈ వీడియోలో చూడొచ్చు.

శ్రీ ఛాయా సోమేశ్వరాలయం





29, నవంబర్ 2018, గురువారం

మా గుంటూరు ఆర్ట్స్ & క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ @ గుంట గ్రౌండ్


గుంటూరు గుంట గ్రౌండ్ గుంటూరు వాళ్లందరికీ బాగా తెలిసిన,పరిచయమున్న ప్రదేశం.ఇక్కడ మా చిన్నప్పుడు, అలాగే ఇప్పుడు కూడా సమ్మర్ లో ఎగ్జిబిషన్ పెడతారు.అందుకే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అని, దీన్నే నాజ్ సెంటర్ అని కూడా పిలుస్తారు.ఈ  మధ్య సంవత్సరంలో రెండు మూడు సార్లు ఆర్ట్స్ & క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ కూడా పెడుతున్నారు. మేము కూడా వెళ్తుంటాము. ఎగ్జిబిషన్  విశేషాలు ఈ వీడియోలో చూడొచ్చు. 

 మా గుంటూరు ఆర్ట్స్ & క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ @ గుంట గ్రౌండ్ 





23, నవంబర్ 2018, శుక్రవారం

మా ఊరు - మా స్కూల్ - మా జ్ఞాపకాలు - My School Memories




Old School Memories 
A trip down memory lane..




17, నవంబర్ 2018, శనివారం

శ్రీ చింతల రామలింగేశ్వర స్వామి ఆలయం (రామప్ప గుడి) - మాచర్ల - గుంటూరు జిల్లా



ఆలయంలో 2016 లో ఏర్పాటుచేసిన శివపార్వతుల విగ్రహాలు


మా మాచర్లలోని రామప్పగుడి - శ్రీ గంగా పర్వతవర్ధినీ సమేత, శ్రీ చింతల రామలింగేశ్వర స్వామి ఆలయం చిన్నప్పటి  జ్ఞాపకం.చిన్నప్పుడు కార్తీకమాసం,శివరాత్రి ఇలా పండగరోజుల్లో మాత్రమే ఈ ఆలయం ప్రస్తావన వచ్చేది. ఎందుకంటే ఆ గుడి ఊరికి చాలా దూరంగా ఉండేది.రవాణా సౌకర్యాలు అంతగా ఉండేవి కాదు.అయినా కార్తీకమాసం వనభోజనాలకు,పూజలకు తప్పకుండా ఈ గుడికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు గుడి దగ్గర కూడా ఇళ్ళు,మంచి రోడ్లు,ఆటోలు అన్ని సౌకర్యాలు వచ్చేసాయి.

ఈ గుడి చాలా పురాతనమైనది.జమదగ్ని మహర్షి,రేణుకా మాతల కుమారుడు పరశురాముడు ప్రతిష్టించిన ఆలయంగా చెప్తారు.పరశురాముడు విష్ణుమూర్తి దశావతారాల్లో ఆరవ అవతారం.హైహేయ వంశస్థుడైన కార్తవీర్యార్జున చక్రవర్తి శాపవశాత్తూ చేతులు లేకుండా జన్మించి,దత్తాత్రేయుని పూజించి వేయి చేతులు వరంగా పొందుతాడు.ఒకరోజు వేటకోసం అడవికి వచ్చిన కార్తవీర్యార్జునుడు  జమదగ్ని మహర్షి ఆశ్రమానికి సేదతీరటానికి రాగా జమదగ్ని మహర్షి రాజుకి,ఆయన పరివారానికి పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం పెడతాడు. అది చూసిన కార్తవీర్యార్జునుడు ఓక సాధారణ మహర్షికి ఇదంతా ఎలా సాధ్యపడిందని అడగగా, తన దగ్గరున్న కామధేనువు జాతి గోమాత వలనే అని చెప్తాడు.

అప్పుడు కార్తవీర్యార్జునుడు ఆ గోవును తనకిమ్మని అడగగా మహర్షి నిరాకరిస్తాడు.అందుకో కోపించిన చక్రవరి బలవంతంగా ఆవును తీసుకెళ్ళిపోతాడు.విషయం తెలుసుకున్న పరశురాముడు కార్తవీర్యార్జునుని వేయిచేతులు ఖండించి,సంహరించి గోమాతను తీసుకువస్తాడు.జమదగ్ని మహర్షి పరశురాముడిని మందలించి తపస్సు చేసుకోమ్మని పంపిస్తాడు.పరశురాముడు తండ్రిని చంపినందుకు కక్ష పెంచుకున్న కార్తవీర్యార్జునుని కుమారులు జమదగ్ని మహర్షిని చంపివెళ్ళిపోతారు.తల్లి దుఃఖం చూసిన పరశురాముడు 21 సార్లు భూ ప్రదక్షిణ చేసి, కార్తవీర్యార్జునుని కుమారులతో పాటు అధర్మపరులై ప్రజలను హింసిస్తున్న క్షత్రియ రాజుల్ని  సంహరిస్తాడు. యుద్ధాల్లో  గెలిచిన భూమిని కశ్యప మహర్షికి దానంగా ఇచ్చేసి, పాప ప్రక్షాళన కోసం తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోతాడు

ఆ తపస్సులో భాగంగా శివుడ్ని పూజించి 108 స్వయంభూ శివలింగాలను ప్రతిష్టించినట్లు, అందులో ఒకటి మాచర్ల లోని ఈ రామప్ప గుడి అనేది స్థలపురాణం.రామప్పగుడిని దక్షిణ కాశీగా పిలుస్తారు.ఇక్కడ స్వామిని దర్శిస్తే కాశీలో విశ్వనాధుడ్ని దర్శించినట్లుగా భక్తులు భావిస్తారు.ఇక్కడ స్వామికి స్వయంగా మనమే అభిషేకాలు చేయొచ్చు,స్పర్శదర్శనం చేసుకోవచ్చు.మేము ఈ కార్తీక మాసంలో మొదటి సోమవారం ఈ గుడికి వెళ్ళాము.ఆలయంలో స్వామివారికి అభిషేకాలు,అమ్మవారికి కుంకుమపూజ,రుద్రహోమం, ప్రతిరోజూ భక్తులకు అన్నదానం,సహస్ర దీపాల సేవ అన్ని చాలా బాగా జరుగుతున్నాయి.


మా రామప్పగుడిని ఈ వీడియోలో చూడొచ్చు 
 



Related Posts Plugin for WordPress, Blogger...