పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

2, ఏప్రిల్ 2011, శనివారం

ప్రపంచకప్ విజేత భారత్...





02-ఏప్రిల్-2011.... భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు ...
భారత జట్టు ప్రపంచకప్ గెలిచినరోజు...భారత్ లో పండగరోజు...
వాంఖడే స్టేడియం లో రోజు జరిగిన ఫైనల్ లో శ్రీలంకను ఆరు వికెట్ల తేడాతో ఓడించి
ధోని జట్టు సగర్వంగా ప్రపంచకప్ ను అందుకున్నారు.

నేనెప్పుడు క్రికెట్ చూడను కానీ సారి మాత్రం ఫైనల్ మొదటినుండి చివరిదాకా ఎంతో ఆత్రుతగా
మాచ్ చూసాము అందరం...
ఎంతో ఉత్సాహంగా విజయాన్ని కోరుకుని మాచ్ చూస్తున్న అందరికీ సచిన్,సెహ్వాగ్ ఓటమి నిరాశని కలిగించింది..
కానీ గంభీర్,కోహ్లి చాలా నిదానంగా, జాగ్రత్తగా ఆడుతూ సాహసం చేసే వారి వైపే విజయం నిలుస్తుందన్న మాటను నిజం చేసారు...
ఇక ధోని నిజమైన నాయకుడు ఎలా ఉండాలో అలా ప్రపంచకప్ గెలిచి సంచలనం సృష్టించాడు..

28 సంవత్సరాల నిరీక్షణ ఫలించి,భారతీయులందరినీ ఆనందడోలికల్లో ముంచెత్తిన విజయం, క్షణం చిరస్మరణీయం...
భారత్ క్రికెట్ టీంకు అభినందనలు...
టీం ఇండియాకి మా చెల్లి రమ్యనాయుడు గిఫ్ట్


All the best to indian cricket team and thanks for the precious gift to india




Related Posts Plugin for WordPress, Blogger...