పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

31, అక్టోబర్ 2011, సోమవారం

ఈ ప్రేమలేంటో ఈ ప్రేమించడం ఏంటో....


ప్రేమ...
తల్లి కొకటి.....తండ్రికొకటి
చెల్లి
కొకటి.....అక్కకొకటి
తమ్ముడి
కొకటి.....అన్నకొకటి
మిత్రుని
కొకటి.....ప్రేయసికొకటి
పేదవాని
కొకటి....డబ్బున్న వాడికొకటి

ఎన్ని ప్రేమలు.. ఎన్నెన్ని రకాల ప్రేమలు
ఎక్కడెక్కడి
ప్రేమలు
క్షణానికి
వంద సార్లైనా వీటన్నిటితో అవధానం చేస్తుండాలేమో...

అసలెవరు కనిపెట్టారీ ప్రేమల్ని
అనుక్షణమూ
బంధించే గొలుసుల్ని
ఎవరు
కనిపెట్టారీ ప్రేమల్ని
ప్రతి
క్షణమూ గుండె ని గుచ్చేసే ముళ్ళని
ఎవరు
కనిపెట్టారీ ప్రేమల్ని
ఎవరు
కొనిపెట్టారీ ప్రేమల్ని

ప్రేమలేంటో ప్రేమించడం ఏంటో
చక్కగా
రాళ్ళమధ్యలోనో గడిపేసి
రాళ్ళ లాగానే స్పందనా లేకుండా ఉండగలిగితే???
ఇది సాధ్యమేనా???

ఇది నేను రాసింది కాదు..నెట్ లో దొరికింది నాకు నచ్చింది..
నిజమే
కదా అనిపించింది...
రచయిత
కు ధన్యవాదములు..


30, అక్టోబర్ 2011, ఆదివారం

నేనంటే నాకు చాలానే ఇష్టం...అద్నాన్ శామీ

 
ప్రపంచంలో కీ బోర్డుని అత్యంత వేగంతో వాయించగల సమర్ధుడు,
భారతీయ రాగాల్ని పియానో మీద పలికించిన 'పాప్ పాషా' అద్నాన్ శామీ.
ఒకసారి ఇధియోపియాలో దారుణమైన కరువొచ్చింది..దానికి చలించిన అద్నాన్ శామీ'రన్ ఫర్ యువర్ లైఫ్' అనే గీతాన్ని స్వయంగా రచించి గానం చేస్తూ ప్రదర్శించారు.ఆ ప్రదర్శనకు వచ్చిన లక్షల మంది విరాళాలు అందించారు.శామీని ఐక్యరాజ్య సమితి శాంతి పతకంతో సత్కరించింది.
సంగీత రాయబారిగా ప్రకటించింది.

అద్నాన్ శామీ పాడిన ఊసరవెల్లి సినిమాలో 'నేనంటే నాకు చాలానే ఇష్టం' పాట చాలా బాగుంది.ఈ మధ్య వచ్చిన సినిమాల్లో నాకు నచ్చిన పాట ఇది..
తనను తాను ఇష్టపడే ఒక అబ్బాయి నేనంటే నాకు చాల ఇష్టం అంటూనే
నువ్వంటే ఇంకా ఇష్టం అంటూ తను ప్రేమించిన అమ్మాయిని నింగి నేలతో పోటీ పడుతూ ఎంతగా ఇష్టపడుతున్నాడో చెప్పే ఒక ప్రేమికుని మనసులోని అద్భుతమైన భావాలే ఈ పాట.



నేనంటే నాకు చా లానే ఇష్టం




నేనంటే నాకు చా లానే ఇష్టం
నువ్వంటే
ఇంకా ఇష్టం
చోటనైనా వున్నా నీకోసం
నా
ప్రేమ పేరు నీలాకాశం

చెక్కిళ్ళు
ఎరుపయ్యే సూరీడు చూపైన
నా
చేయి దాటందే నిను తాకదే చెలీ
ఎక్కిళ్ళు
రప్పించే చిన్ని కలతైనా
నా
కన్ను తప్పించి నను చేరదే చెలి చెలి చెలీ

నేనంటే
నాకు చాలానే ఇష్టం
నువ్వంటే
ఇంకా ఇష్టం

వీచే
గాలీ నేను పోటీ పడుతుంటాం
పీల్చే
శ్వాసై నిన్ను చేరేలా
నేలా
నేనూ రోజూ సర్దుకుపోతుంటాం
రాణీ
పాదాలు తలమోసేలా


పూలన్నీ నీ సొంతం .. ముళ్ళన్నీ నాకోసం
ఎండల్ని
దిగమింగే నీడనై ఉన్నా
రంగు నీ నేస్తం అదేగా నా నేస్తం
నీ
నవ్వుకై నేను రంగు మార్చనా

నేనంటే
నాకు చాలానే ఇష్టం
నువ్వంటే
ఇంకా ఇష్టం


చేదు బాధలేని లోకం నేనవుతా
నీతో
పాటే అందులో ఉంటా
ఆటా
పాటా ఆడే బొమ్మై నేనుంటా
నీ
సంతోషం పూచీ నాదంటా

 
చిన్నారి
పాపలకూ చిన్నారి ఎవరంటే
నీవంక
చూపిస్తా అదుగో అనీ

ప్రియాతి ప్రియమైన ప్రయాణం ఏదంటే
టకాలని
చెప్పేస్తా నీతో - ప్రేమనీ..


నేనంటే నాకు చాలానే ఇష్టం
నువ్వంటే
ఇంకా ఇష్టం



సినిమా:ఊసరవెల్లి
రచన:రామజోగయ్య శాస్త్రి
సంగీతం:దేవిశ్రీ ప్రసాద్
గానం:అద్నాన్ శామీ




29, అక్టోబర్ 2011, శనివారం

కాణిపాకం To విష్ణు కంచి 10 - SomeThing Special In Tamilnadu

తమిళనాడు ప్రయాణంలో నాకు నచ్చిన కొన్ని విశేషాలు

జయలలిత హోర్డింగ్

వెల్లూర్ లో మేము తిన్న టిఫిన్

కంచిలో చేసిన భోజనం

కంచిపేరు చెప్తేనే గుర్తుకు వచ్చే ఆడవాళ్ళకి ఇష్టమైన
కంచిపట్టు
చీరల షాప్

తమిళనాడు ఆలయాల్లో ప్రసాదాలు

ఆలయాల దగ్గర పూజాసామాగ్రి షాప్

కాణిపాకం To విష్ణుకంచి - 9 విష్ణుకంచి

వరదరాజస్వామి దేవాలయం - విష్ణుకంచి
వరదరాజ పెరుమాళ్ దేవాలయం ఉన్న ప్రాంతం విష్ణుకంచి
ఇక్కడ వరదరాజ పెరుమాళ్ ని చూస్తుంటే తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దగ్గరనుండి చూస్తే
ఇలాగే ఉంటుందేమో అనిపించేంత నిలువెత్తు విగ్రహం.
స్వామివారిని చాలా దగ్గరనుండి దర్శించుకోవచ్చు..
వరదరాజ పెరుమాళ్
ఆ దేవాలయం పరిసర ప్రాంతాలు, ఆ మండపాలు అవన్నీ చూస్తుంటే నాకు ఒక్కసారిగా ఎన్నో ఏళ్ల
వెనక్కి వెళ్లి పోయినట్లుగా,ఆ ప్రాచీనకాలంలోనే నేను కూడా వున్నట్లుగా అనిపించింది.
అంత పురాతన కట్టడాలైనా ఎంతో గంభీరంగా, ఆనాటి రాజుల రాజరికం ఉట్టిపడే ఎత్తైన గోపురాలు,
ఈ ఆలయాలలో చెక్కిన శిల్పకళా నైపుణ్యం అందరినీ ఆకట్టుకుంటుంది.
ఈ దేవాలయంలో బంగారు బల్లి, వెండి బల్లులు ఉండడం మరో విశేషం .
వీటిని తాకితే అంత వరకు బల్లులు మీద పడిన దోషాలు పోతాయని,ఇకముందు పడినా ఏమీ దోషం
ఉండదని అందరి నమ్మకం.
బంగారు బల్లి, వెండి బల్లులు
అమ్మవారిని కూడా దర్శించుకుని,తీర్ధ ప్రసాదాలు తీసుకుని కాసేపు ఆలయమంతా తిరిగి చూసి,
కంచి ఫేమస్ కంచిపట్టు చీరలు కొనటానికి షాపింగ్ కి వెళ్ళాము.
ఇలా మా తమిళనాడు దేవాలయాల టూర్ హ్యాపీగా,సంతృప్తికరంగా,మరిచిపోలేని మదురానుభూతిగా
పూర్తి అయ్యింది..కొన్ని మంచి పుణ్యక్షేత్రాలను చూసిన ఆనందంతో ఇంటికి తిరిగి వచ్చాము..

కాణిపాకం To విష్ణుకంచి - 8 శివకంచి.


శ్రీపురం
టెంపుల్ తర్వాత కంచి వెళ్ళాము అక్కడ నైట్ స్టే చేసి ఉదయాన్నే దర్శనానికి వెళ్ళాము.
ఈ కాంచీపురం రెండు భాగాలుగా వుంటుంది. అవి శివ కంచి,విష్ణు కంచి ఈ రెండు ప్రాంతాల మధ్యలో
అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన కామాక్షి అమ్మవారి ఆలయం వుంది.
ఏకాంబరనాధుని దేవాలయం ఉన్న ప్రాంతాన్ని శివకంచి అని,
వరదరాజ పెరుమాళ్ దేవాలయం ఉన్న ప్రాంతాన్ని విష్ణుకంచి అని పిలుస్తారు.

కంచి కామాక్షి ఆలయం - కంచి.

అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన కంచి కామాక్షి అమ్మ గ్రరూపంలో ఉండేదట.ఆ ఉగ్ర రూపంలో
వున్న అమ్మవారిని శాంతింప చేయటానికి ఆది శంకరాచార్యుల వారు తన స్వహస్తాలతో ఇక్కడ
శ్రీ చక్రాన్ని ప్రతిష్టించారట...
మేము
ముందుగా కామాక్షి అమ్మవారిని దర్శించుకుని అక్కడి నుండి
ఏకంబరనాధుని కోవెలకి వెళ్ళాము.
ఏకాంబరేశ్వర దేవాలయం - శివకంచి

ఇక్కడ శివుడు పంచభూతాల క్షేత్రాలలో ఒకటైన పృధ్వీలింగం ( సైకత లింగం)
అందుకే ఇక్కడ శివుడికి పాలు, నీళ్ళతో అభిషేకం చేయరని అక్కడ పూజారి చెప్పారు.
ఆలయంలో వేయి స్తంభాల మంటపం,కోనేరు చాలా బాగున్నాయి.
ప్రశాంతమైన వాతావరణం లో ఆలయం చాలా పవిత్రమైన భావనను కలిగించేలా వుంది..
ఆలయంలో ఒక మామిడి చెట్టుకింద పార్వతి అమ్మవారు శివుడి కోసం తపస్సు చేసిందట
ఆ మామిడి చెట్టు సుమారు 3500 సంవత్సరాల వయస్సు కలిగి ఉంటుందని అక్కడ పూజారి చెప్పారు.
ఈ మామిడి చెట్టు దగ్గర ఏ కోరిక కోరుకున్నా వెంటనే జరుగుందట..
పార్వతి అమ్మవారు తపస్సు చేసిన మామిడిచెట్టు


గర్భగుడిలోని ఏకాంబరేశ్వరుడు
ఇక్కడ కూడా దర్శనం అయినతర్వాత అక్కడే దేవస్థానం వాళ్ళే విక్రయిస్తున్న
పులిహోర,పొంగలి,దద్దోజనం ప్రసాదాలను తీసుకుని తిన్నాము.
తమిళనాడులోని అన్ని ఆలయాలలో బయటికి వెళ్లి హోటల్స్ లో తినే అవసరం రానట్లుగా పెడతారు ప్రసాదాలు.
పది రూపాయలకే ఒక మనిషికి సరిపడే ప్రసాదం పెట్టే పధ్ధతి బాగుంది ఇక్కడ.
ప్రతి దేవాలయంలో తీర్ధంతో పాటూ స్వామి, అమ్మవార్ల విభూది,కుంకుమ ఇచ్చి ఆశీర్వదించటం చాలా సంతోషంగా అనిపిస్తుంది.

ఆలయం నుండి బయటికి వచ్చి ఇక్కడికి దగ్గరలోనే వున్న వామన దేవాలయానికి వెళ్ళాము .
బలిచక్రవర్తిని దానమడిగిన వామనమూర్తి విశ్వాన్ని మొత్తాన్ని ఆక్రమిస్తున్నట్లు చూపిస్తున్నట్లుగా వున్న విగ్రహం చాలా పెద్దది.
ఒకప్పుడు హారతి వెలుగులోనే ఈ విగ్రహాన్ని చూసేవారట.ఇప్పుడు లైట్ల వెలుగులో చూస్తున్నారు..

వామనావతార
దేవాలయం-శివకంచి


28, అక్టోబర్ 2011, శుక్రవారం

కాణిపాకం To విష్ణుకంచి - 7 శ్రీపురం గోల్డెన్ టెంపుల్

గోల్డెన్ టెంపుల్ అనగానే ఇంతకుముందు అమృతసర్ లోని సిక్కు దేవాలయమే గుర్తుకు వచ్చేది
కానీ ఇప్పుడు గోల్డెన్ టెంపుల్ అనగానే సుమారు 600 కోట్లు ఖర్చు పెట్టి మన భారత దేశంలో కట్టిన
నారాయణీ పీఠం శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దానికి పోటీగా నిలుస్తుందని చెప్పొచ్చు
తమిళనాడులోని వెల్లూర్ కి 6 కిలోమీటర్ల దూరంలో తిరుమలైకొడి లో ఈ శ్రీపురం స్వర్ణ దేవాలయం కొలువై వుంది.
ఇక్కడ కూడా తిరుమల లాగానే స్ట్రిక్ట్ రూల్స్ వున్నాయి. ఫోన్స్ కానీ కెమెరాలు కానీ లోపలి తీసుకెళ్ల కూడదు.
మగవాళ్ళను,ఆడవాళ్ళను వేరు వేరుగా చెకింగ్ చేసిన తర్వాత క్యూ లైన్ లో పంపిస్తారు..
శ్రీచక్రం ఆకారంలో వున్న కారిడార్లో నడుస్తూ అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి.దర్శనానికి వెళ్ళే దారి అంతా అందమైన ల్యాండ్ స్కేప్స్,చక్కని సీనరీస్,పార్క్,మంచి కొటేషన్స్ తో వున్న బోర్డులు,వివిధరూపాల్లో వున్న అమ్మవారి విగ్రహాలు ఇవన్నీ చూస్తూ వెళ్తూవుంటే నడిచిన అలసట తెలియకుండా చేస్తాయి.
ఆలయం సమీపానికి రాగానే ఆ బంగారు ఆలయం వెలుగులు మనల్ని మరోలోకంలోకి
తీసుకెళ్ళినట్లు అనుభూతి చెందుతాము.
చుట్టూ ఆవరించిన నీటిలో మధ్యలో సువర్ణ శోభితమైన ఆ ఆలయాన్ని చూడటానికి
రెండు కళ్ళు చాలవు అన్నట్లుగా వుంది.
పైగా మేము రాత్రి సమయంలో వెళ్ళటంతో ఆ బంగారు కాంతులకు విద్యుత్ దీపాల కాంతులు తోడై
ఆ అమ్మవారి మణి ద్వీపమే ఈ నేలమీదకి వచ్చిందా అన్నట్లు అనిపించింది..
అమ్మవారి దర్శనం బాగా జరిగింది.ఆ అమ్మవారి మీదనుండి చూపులు మరల్చుకోలేనంత
మనోహరంగా వుంది శ్రీ నారాయణీ మాత..
దర్శనం తర్వాత అక్కడ కారిడార్లోనే అమ్మవారి పూజకి ఉపయోగించే రకరకాల సుగంధ ద్రవ్యాలు,
పూజా సామాగ్రి అమ్మే స్టాల్స్ వున్నాయి..అవి తీసుకున్నాము.
ఇక్కడ తీసుకున్న ధూప్ స్టిక్స్,బత్తీలు అపూర్వమైన సువాసనతో వున్నాయి..
కుంకుమ కూడా మొగలి పూల వాసనతో చాలా పవిత్రమైన భావన కలిగించేలా వున్నాయి..
ఇక్కడ కూడా రకరకాల పిండి వంటలే ప్రసాదాలుగా అమ్ముతారు
అవి కూడా కొన్నాము.. ముఖ్యంగా నాకు నచ్చిన ప్రసాదం శ్రీ మధు అనే లడ్డు ప్రసాదం..
ఇక్కడ ప్రసాదాలన్నీ చాలా బాగున్నాయి.
బయటికి రాగానే శ్రీ అన్నపూర్ణ మండపంలో పుదీనారైస్ ప్రసాదం పెట్టారు...
మొత్తానికి శ్రీపురం వైభవాన్ని మాటలతో వివరించలేము..
దైవానుగ్రహము ఉన్నవారి వలన మాత్రమే ఇటువంటి అద్భుత సృష్టి సాధ్యమవుతుంది.
ఆ అమ్మవారి యొక్క పరిపూర్ణ కృప శ్రీపురంలో నిండి వుందని చెప్పొచ్చు..
ఒక అపూర్వమైన అనుభవం ఈ శ్రీపురం దర్శనం..
అక్కడ నుండి వెల్లూరు వచ్చి భోజనాలు చేసి కంచి బయలు దేరాము..

శ్రీపురం గోల్డెన్ టెంపుల్




కాణిపాకం To విష్ణుకంచి - 6 సాతనూర్ డామ్


తిరువన్నామలై నుండి 30 కిలోమీటర్ల దూరంలో వున్న మరొక చూడదగిన ప్రదేశం సాతనూర్ డామ్..
1958 వ సంవత్సరంలో కట్టిన ఈ డామ్ లో 1960-1980 లలో ఎన్నో సినిమాల షూటింగ్స్ కూడా జరిగేవట.
తిరువన్నామలై నుండి బయలుదేరి డామ్ చేరుకోవటానికి తమిళనాడులోని పల్లెటూర్లు,
పచ్చటి పొలాల మధ్య సాగుతుంది ప్రయాణం ..
ఇక్కడ అందమైన పార్క్ లు,లాన్ లు,అందమైన విగ్రహాలు
బోటింగ్ లతో చాలా ఆహ్లాదకరంగా వుంది..
పిల్లలతో ఎంజాయ్ చేయటానికి చక్కగా ఉపయోగపడే ప్రదేశం.








కాణిపాకం To విష్ణుకంచి - 5 అరుణాచలం (తిరువన్నామలై )

సెప్టెంబర్ 5 ఉదయం రమణ మహర్షి ఆశ్రమం నుండి బయలుదేరి అరుణాచలేశ్వరుని దర్శనానికి వెళ్ళాము.
అరుణాచలం ఈ దేవుడిని దర్శించుకోవాలని మా చిరకాల వాంఛ...
జెమిని టీవీ లో శివయ్యగా,సన్ టీవీలో అన్నామలై గా వచ్చిన సీరియలో అరుణాచలం గుడిని
చూసి ఈ గుడి ఎంత బాగుంది ఎప్పటికైనా తప్పకుండా చూడాలి అని అనుకునేవాళ్ళం..
మా కోరికను శివయ్య అనుకోకుండా తీర్చటం మా పూర్వజన్మ పుణ్య ఫలం అని చెప్పొచ్చు..

అరుణాచలం
ఎక్కువగా ఋషులు,జ్ఞానులు ఈ అరుణాచలానికి వస్తుంటారని అతిథి ఆశ్రమంలో
మదర్ సౌమ్య చెప్పారు..వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం
పంచభూతాలలో ఒకటైన అగ్నిగా శివుడు వెలసిన క్షేత్రం అరుణాచలం.
అహంకారమనే చీకటిని తొలగించటానికి భగవంతుడు జ్యోతి స్వరూపమై వెలసి,
పర్వతంగా
నిలచిన మహిమాన్వితమైన క్షేత్రం అరుణాచలం.
అరుణాచలం స్వయంగా శివుడే..ఇక్కడ భగవంతుడైన శివుడు పర్వతరూపంలో వున్నాడు..
ప్రతి కార్తీక పౌర్ణమికి ఒక ప్రత్యేక సంతతి వారు మాత్రమే కొండపైకి వెళ్లి దివిటీలతో అఖండ దీపాన్ని వెలిగిస్తారు.
ఈ అఖండ జ్యోతి మూడు రోజుల పాటు వెలుగుతుంది.

ఈ కొండపై ఎన్నో ఔషద గుణాలు కలిగిన వనమూలికలు లభిస్తాయి.ప్రతి పౌర్ణమి రోజుకి చంద్రకిరణాలు సోకి
మూలికలు అమృతత్వాన్ని పొంది ఆ మూలికల పైనుండి వీచే గాలిని పీలిస్తే ఎటువంటి వ్యాధులైన నయమవుతాయని నమ్మకం అక్కడ.అందుకే ప్రతి పౌర్ణమికి వేల సంఖ్యలో భక్తులు వచ్చి చెప్పులు లేకుండా అరుణగిరికి ప్రదక్షిణ చేస్తారట.
భక్తులు ముందుగా సుమారు 16 కిలోమీటర్ల చుట్టుకొలత కలిగిన అరుణాచలానికి ప్రదక్షిణ చేసి అప్పుడు
ఆలయంలోకి
వెళ్తారు.
కొందరునడిచి,చేతకానివాళ్ళు వివిధ వాహనాల మీద అరుణాచలం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు.
మేము కూడా మా వెహికల్ లోనే అరుణాచలం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి ఆలయానికి బయలుదేరాము..
అరుణగిరి ప్రదక్షిణ
ఆలయానికి వెళ్ళీ వీధులన్నీ చాలా రద్దీగా వున్నాయి.ట్రాఫిక్ చాలాఎక్కువగానే వుంది.
గుడికి కొంత దూరంనుండే ఆలయప్రధాన గోపురం కనపడుతూ వుంది.
దగ్గరికి వెళ్ళేకొద్దీ ఆలయ గోపురం నేలంతా విస్తరించి,గోపుర కలశాలు ఆకాశంలోని మబ్బులను
తాకుతూ మనసును ఏదో తెలియని ఆనంద పారవశ్యంలో ముంచెత్తింది.
నేను అనుభవించిన ఆ అనుభూతిని నేను మాటల్లో ఇంకా సరిగా చెప్పలేకపోతున్నాను.
ఎంతగా
తలెత్తి చూసినా పూర్తిగా కనపడనంత ఉన్నతంగా ,అపూర్వమైన శిల్పసంపదతో
అలరారుతున్న
ఆ గోపురం అందం నేను వర్ణించలేనేమో ..
ఆలయం ప్రధాన గోపురం
ఇక్కడ నాకు నచ్చిన మరో విషయం అందమైన పూలు,పూల మాలలు..
చాలా తక్కువ రేటుకే గులాబీ, కలువ పూలదండలు ఎంతో అందంగా కట్టి అమ్ముతున్నారు..
మేము కూడా పూలదండలు,పూజా సామాగ్రి కొనుక్కుని ఆలయంలోకి వెళ్ళాము..
ఆలయంలోకి వెళ్ళగానే వెనుక అరుణాచలం దాని ముందే ఆలయ శిఖరాలతో గోపురాలు,
మండపాలు ,అపురూపమైన శిల్పకళా సౌందర్యంతో,పరిశుభ్రమైన ఆలయప్రాంగణం
కన్నులపండువగా అలౌకికమైనఆనందాన్ని కలిగించేలా వుంది.
ఆలయంలోపలి ప్రాంగణం
ముందుగా అరుణాచలేశ్వరుని ఆలయంలోకి వెళ్ళాము అక్కడ గర్భగుడిలో పూజలు చేయించి,
సుమారు పావుగంట గర్భగుడిలో కూర్చున్న మా అందరికీ వొళ్ళంతా చెమటలు పట్టేసాయి..
అప్పుడు అక్కడ పూజారి చెప్పిన స్థల పురాణం ప్రకారం అరుణాచలేశ్వరుడు పంచభూతాలలో
ఒకటైన అగ్నిలింగమని అందుకే అక్కడ ఎప్పుడు అలాగే వేడిగా ఉంటుందని తెలిసింది.
ఇంక అక్కడ పూజ అయిపోగానే స్వామివారి విభూది,కుంకుమ,ప్రసాదాలు తీసుకుని అమ్మవారి

దర్శనానికి వెళ్ళాము.
శివునిలో అర్ధ భాగం కోసం కఠోరమైన తపస్సు చేసి సాధించుకున్న అమ్మవారిని ఇక్కడ
ఉణ్ణామలై (
అపర్ణ )గా పూజిస్తారు.అమ్మవారి దర్శనం కూడా గర్భగుడిలోకి వెళ్లి ప్రశాంతంగా జరిగింది.
చాలా దగ్గరనుండి అమ్మవారిని చూసిన మాకు చాలా సంతోషంగా అనిపించింది.
అక్కడినుండి బయటికి వచ్చి అక్కడ టికెట్ తీసుకుని వెలిగించే దీపాలను అందరం తీసుకుని వెలిగించాము.
ఆలయ ప్రాంగణంలో వున్న అన్ని గుడులలో దర్శనాలు చేసుకుని ఆలయంలో వున్న కోనేరు,
ఆలయంలోనే
వున్నరమణ మహర్షి పూజ చేసిన పాతాళలింగాన్ని కూడా దర్శించుకున్నాము.
ఆలయంలోని కోనేరు
అక్కడే ప్రసాదాలు తీసుకున్నాము...ఇక్కడ ప్రసాదాలు వెరైటీగా వున్నాయి..
జంతికలు ,అరిసెలు,లడ్లు,చెక్కలు ఇలా 4 రకాల పిండివంటలు ప్రసాదాలుగా ఒక కవర్ లో పెట్టి అమ్ముతారు..
అవి కొనుక్కుని అక్కడే వున్న పులిహోర ,ఆరెంజ్ కలర్లో హల్వాలాగా అనిపిస్తున్న స్వీట్ పొంగలిని
కొనుక్కుని తిని ,ప్రశాంతంగా అక్కడే కాసేపు కూర్చుని
అనుకోకుండా మాకు కలిగిన ఈ అదృష్టాన్ని ఆ అరుణాచలేశ్వరుడు మాకు ఇచ్చిన గొప్పవరంగా భావిస్తూ
ఈ మధురానుభూతులను మా గుండెలలో పదిలపరచుకుని ఆ స్వామిని మనసులో నిలుపుకుని
గుడి బయటికి వచ్చాము..
అరుణాచలం ఆలయ నమూనా
బయటికి రాగానే ఆలయం నుండి కార్ దగ్గరికి వెళ్ళే లోపే మా కాళ్ళు మే నేల ఎండల్లో
మనరోడ్ల మీద ఎలా కాల్తాయో అలా కాలిపోయాయి.
కాళ్ళు ఎక్కడ తారు రోడ్డుకు అంటుకుపోతాయో అన్నంత భయం వేసింది.
అంత వేడిగా వుంది ఇక్కడ వాతావరణం...
ఇక్కడ కూడా షాపింగ్ చేసుకుని అరుణాచలేశ్వరుడు,అమ్మవారి ఫోటోలు కొనుక్కుని
మరలా
మా ప్రయాణం మొదలుపెట్టాము.
అరుణాచల స్తోత్రం



Related Posts Plugin for WordPress, Blogger...