పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

26, నవంబర్ 2011, శనివారం

'న్యాయ దినోత్సవం'

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాజ్యాంగ రచనకు ఒక పూర్తి స్థాయి కమిటీ ఏర్పడింది.
ఆ కమిటీ రూపొందించిన రాజ్యాంగ ముసాయిదా తొలి ప్రతి మీద 1949 నవంబర్ 26 న
రాజ్యాంగకమిటీ సభ్యులు సంతకాలు చేశారు. 'భారత రాజ్యాంగం'
1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది.
నవంబర్ 26 ను 'జాతీయ న్యాయ దినోత్సవం' గా జరుపుకోవాలని
భారత
అత్యున్నత న్యాయస్థానం రెండు దశాబ్ధాల క్రితం నిర్ణయించింది.

రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేయటమే కాక,రాజ్యాంగానికి రక్షణగా
న్యాయవ్యవస్థ పని చేస్తుంది కనుక,రాజ్యాంగ తొలి ప్రతులపై రాజ్యాంగ కమిటీ సభ్యులు
సంతకం చేసి, రాజ్యాంగ ముసాయిదాను అధికారకంగా ఆమోదించిన నవంబర్ 26 ని
న్యాయదినోత్సవంగా జరుపుకోవటం ఆనవాయితీగా మారింది.
చట్టం ముందు అందరు సమానమని ,
ప్రజలందరికి సత్వర న్యాయం అందచేయటమే న్యాయదినోత్సవ ధ్యేయం..

నిజమైన న్యాయాన్ని గెలిపించడానికి కృషి చేసే ప్రతి ఒక్కరికీ న్యాయదినోత్సవ శుభాకాంక్షలు

Related Posts Plugin for WordPress, Blogger...