పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

14, అక్టోబర్ 2015, బుధవారం

మనుషులు .. మనస్తత్వాలు




 "అత్తా మామలతో మూత్రం తాగిస్తున్న కోడలు"

ఇంతకీ విషయం ఏమిటి అంటే ఇండోర్ కు చెందిన రేఖ నాగవంశి అనే మహిళ 8 ఏళ్ళ క్రితం దీపక్ అనే యువకుడిని పెళ్ళాడి, ఇంట్లో అత్తా మామలతో గొడవల కారణంగా అలిగి భర్తను వదిలేసి వెళ్ళిపోయింది. దీపక్ బతిమాలడంతో కొన్ని షరతుల మీద భర్త లో కలిసి ఉంటుంది. అయినా వారానికి ఒక్కసారి వచ్చి పోయే అత్తమామలను చూసి విసుగు చెందిన రేఖ వారిపై కక్షగట్టి, వారు ఉన్నన్ని రోజులు టీలో మూత్రం కలిపి ఇవ్వడం మొదలెట్టింది.

ఇది ఏడాదిగా జరుగుతూనే ఉంది.ఈ విషయం తెలియని అత్తమామలు నవ్వుతూ టీ ఇస్తున్న కోడల్ని చూసి,ఆహా మా కోడలు మారిపోయిన మనిషి...మాకు ఎంత మర్యాద ఇస్తుంది అని మురిసిపోయారట.ఒకరోజు కోడలు టీపాట్ లో మూత్రం పోస్తూ ఉండటం గమనించిన అత్త, ఇన్ని రోజులు తాము తాగింది కోడలు మూత్రం కలిపిన టీ అని గ్రహించి పోలీసులకు పిర్యాదు చేయడానికి వెళ్ళగా సాక్ష్యాలు లేవని పోలీసులు పిర్యాదును స్వీకరించబోమని చెప్పడంతో కోర్టును ఆశ్రయించే పనిలో పడ్డారు.

దేవుడా ఇలాంటి మనుషులు కూడా ఉంటారా?? నచ్చకపోతే ఎదురెదురుగా తేల్చుకోవాలి లేదా వదిలేసిపోవాలి అంతే కానీ ఇలాంటి నీఛానికి పాల్పడే వాళ్ళు మనుషులేనా అనిపించే  జుగుప్సాకరమైన సంఘటనలు తెలిసినప్పుడు అమ్మో ఇంకెప్పుడైనా ఒకప్పుడు శత్రువులైనా మళ్ళీ ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారులే అని ఎవరినీ నమ్మకూడదు బాబోయ్ అనిపిస్తుంది.చెప్పుకోవటానికే ఇంత  అసహ్యకరంగా అనిపిస్తున్న ఈ విషయం అనుభవించిన వాళ్ళ పరిస్థితి ఏమిటో పాపం.

పెద్దలు చెప్పినట్లు ఇంటిదొంగని ఈశ్వరుడైనా పట్టలేడు, బయటి శత్రువులు ఎదురుగా కనపడతారు కానీ మనతో పాటూ ఉంటూ మనకి కీడు చేసే అంతర్గత శత్రువుల్ని ఎవరు మాత్రం ఏమి చేయగలరు వాళ్ళ పాపం పండటానికి ఎదురుచూడటం తప్ప..


Related Posts Plugin for WordPress, Blogger...