పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

30, జూన్ 2010, బుధవారం

నా పంచ ప్రాణాలే నీవనీ....


పంచభూతాల సాక్షిగా...
పంచామృతాల సాక్షిగా...
పంచేంద్రియాల సాక్షిగా...
పంచాక్షరాల సాక్షిగా...
నా పంచ ప్రాణాలే నీవనీ... పంచేసుకుంటా నీతో ప్రేమనీ...

మూడుముళ్ల బంధంతో, ఏడడుగులతో రెండు మనసులను ఒక్కటి చేస్తుంది వివాహబంధం.

ధర్మేచ...మోక్షేచ...కామేచా...అర్దేచా...నాతిచరామి అంటూ భిన్న కుటుంబాలనుండి వచ్చిన ఇద్దరు వ్యక్తులను ఏకం చేస్తుంది వివాహ బంధం.

అప్పటి వరకు ఎవరికీ ఎవరోగా వున్న ఇద్దరు వ్యక్తులను ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా కలిపేది వివాహ బంధం.

భార్యా, భర్తలు జీవిత భాగస్వాములుగా కష్ట,సుఖాలను పంచుకుంటూ ఒకరి కోసం ఒకరుగా,ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ,సాగి పోయే వివాహ బంధం చూడ ముచ్చటగా వుంటుంది.

నిన్ను నిన్నుగా ప్రేమించుటకు... నీకోసమే కన్నీరు నింపుటకు
నేనున్నానని నిండుగ పలికే ....తోడుకరుండిన అదే భాగ్యమూ...అదే స్వర్గమూ

ప్రతి మనిషి జీవితంలో కోరుకునేది ఇలాంటి తోడునే కదా ....

నేను సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన ఈ పాట రాజశేఖర్,జీవితల ఇంద్రధనస్సు సినిమా లో పాట
ఈ పాటలోని సాహిత్యం నాకు చాలా ఇష్టం.
భార్యను అమితంగా ప్రేమించి,ఆరాధించే భర్త ఆమెను గురించి పాడే పాట చాలా బాగుంటుంది.
భార్యను ఇంత వున్నతంగా వూహించుకుని,ప్రేమించే భర్త దొరకటం నిజంగా అద్రుష్టం...

ఇంద్రధనస్సు ఇల్లాలై ఇంటి వెలుగు అయ్యిందీ



రాజి
Related Posts Plugin for WordPress, Blogger...