పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

28, జూన్ 2010, సోమవారం

సర్వాంతర్యామి



భగవంతుని నమ్మి నడక సాగించు  
దైవమే దారి చూపుతాడు.

నా చిన్ని ప్రపంచంలో నన్ను,నా కుటుంబాన్ని భగవంతుడు అహర్నిశలు వెన్నంటి కాపాడుతాడు.
అన్న నమ్మకమే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది .

ఇసుకలోని పాదముద్రలు.

రాత్రి నాకు ఒక కల వచ్చింది
కలలో నేను దేవుడితో కలిసి బీచ్ లో నడుస్తున్నాను
నా జీవితానికి సంబంధిన ఎన్నో సంఘటనలు 
నాకు ఆకాశంలో కనపడుతున్నాయి.
 
ప్రతి సన్నివేశంలోనూ ఇసుకలో పాదముద్రలను 
నేను గమనించాను
కొన్నిసార్లు ఇద్దరి పాదముద్రలు వుండగా 
మరికొన్నిసార్లు ఒక్కరివి మాత్రమే కనిపించాయి
ఇది నన్ను చాలా బాధపెట్టింది... 
ఎందుకంటే
జీవితంలో నేను బాధల్లో,ఓటమిలో,సమస్యల్లో వున్న సమయాల్లో
ఒక్కరి పాదముద్రలు మాత్రమే కనిపిస్తున్నాయి.
అప్పుడు నేను దేవుడితో ఇలా అన్నాను
"తండ్రీ నేను నిన్ను అనుసరించినట్లయితే 
నీవు నన్ను ఎప్పుడు వెన్నంటి ఉంటానని మాట ఇచ్చావు కదా...
కానీ ఇప్పుడు నేను గమనించాను 

నేను జీవితంలో ఎంతో కష్టపడుతున్న సమయాల్లో ఇసుకలో
ఒక్కరి పాదముద్రలే కనిపించాయి.
నీ అవసరం ఎంతగానో వున్న ఆ కష్ట సమయాల్లో
నీవు నా వెంట లేవా ?"
అప్పుడు దేవుడు నాతో అన్నాడు
"అమ్మా నువ్వు కష్టాల్లో వున్నపుడు 

చూసిన ఆ పాదముద్రలు నీవి కావునీకు బాధ తెలియకుండా నేను నిన్ను ఎత్తుకున్నప్పుడు 
పడిన నా పాదముద్రలు అవి"




రాజి
Related Posts Plugin for WordPress, Blogger...