పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

25, నవంబర్ 2011, శుక్రవారం

"ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధములో నిదురించు జహాపనా"

"సుందరదాసు" బిరుదాంకితుడు ఎమ్మెస్ రామారావు తెలుగు చలనచిత్ర చరిత్రలో
మొట్టమొదటి నేపథ్య గాయకుడు. 1944 లో ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాత వై.వి రావు తన
తహసీల్దార్ చిత్రంలో ఎమ్మెస్ చేత మొదటి సారిగా
"ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా"
అనే ఎంకి పాట పాడించారు..
తెలుగు చలన చిత్ర చరిత్రలో ఇది మొట్ట మొదటి నేపథ్య గానం.
గేయ రూపంలో ఈయన రచించి గానం చేసిన సుందరకాండ రామాయణం లోని ఒక భాగం,
ఎమ్మెస్.రామారావు సుందరకాండ
గా సుప్రసిద్ధం.
తులసీ దాసు రచించిన హనుమాన్ చాలీసాను తెలుగులోకి అనువదించి,ఆకాశవాణిలో పాడారు..
ఈ రెండూ వీరికి మంచి గుర్తింపును, ఖ్యాతిని తెచ్చిపెట్టాయి.(wiki)

నీరాజనం సినిమాలో ఈయన పాడిన
"ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధములో నిదురించు జహాపనా"
"పండు వెన్నెల్లో వెండి కొండల్లే తాజ్ మహల్ ధవళ కాంతుల్లో"
అంటూ తాజ్ మహల్ అందాన్ని వర్ణించిన ఈ పాట ఎందుకో నాకు చాలా నచ్చుతుంది.
సినిమాలో ఇది విషాదగీతం అయినా అందమైన ప్రేమకు
ప్రతిరూపంగా చరిత్రలో నిలిచిపోయిన తాజ్ మహల్ లా ఈ పాట కూడా గుర్తుండిపోయింది..

ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో


ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
నిదురించూ జహాపనా
నిదురించూ జహాపనా
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
నిదురించూ జహాపనా
నిదురించూ జహాపనా

పండు వెన్నెల్లో వెండీ కొండల్లే
తాజ్ మహల్ ధవళా కాంతుల్లో
పండు వేన్నెల్లో వెండీ కొండల్లే
తాజ్ మహల్ దవళా కాంతుల్లో
నిదురించూ జహాపనా
నిదురించూ జహాపనా
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
నిదురించూ జహాపనా
నిదురించూ జహాపనా

నీ జీవితా జ్యోతీ నీ మధురా స్మృతీ
నీ జీవితా జ్యోతీ నీ మధురా స్మృతీ
ముంతాజ సతీ సమాధీ సమీపాన నిదురించు
ముంతాజ సతీ సమాధీ సమీపాన నిదురించు జహాపనా
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
నిదురించూ జహాపనా
నిదురించూ జహాపనా



Related Posts Plugin for WordPress, Blogger...