పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

19, అక్టోబర్ 2012, శుక్రవారం

లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం..


 శ్రీ మహాలక్ష్మీ దేవి - 19 - 10 - 2012
ఆశ్వీయుజ శుద్ధ చవితి

ఆశ్వయుజ శుద్ధ చవితి నాడు అమ్మ వారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరిస్తారు.మంగళప్రదమైన దేవత లక్ష్మీదేవి. లోకస్థితికారిణిగా,ధన,ధాన్య,ధైర్యవిజయ,విద్య,సౌభాగ్య,సంతాన,గజలక్ష్ములుగా భక్తులను అనుగ్రహించే అష్టలక్ష్ముల సమిష్టి రూపమే  శ్రీ మహాలక్ష్మి..
రెండు చేతులలో కమలాలను  ధరించి,వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ గజరాజులు  తనని కొలుస్తుండగా కమలాసీనురాలిగా శ్రీ మహాలక్ష్మీ దేవి దర్శనమిస్తుంది..


 లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీ రంగ ధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్షలబ్ద  విభవద్ర్భహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం 

సరసిజాం వందే ముకుంద ప్రియాం

శ్రీ మహాలక్ష్మీ అష్టకం 






2 కామెంట్‌లు:

జయ చెప్పారు...

ఈ దసరా రోజుల్లో రాజీ చిన్ని ప్రపంచం చూడాలంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలుసా?

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

మనందరికీ ఇష్టమైన అమ్మవారిని చూడొచ్చు అందుకే కదండీ :)
దసరా రోజుల్లో నా చిన్నిప్రపంచం మీకు మరింత నచ్చినందుకు చాలా సంతోషమండీ..

Related Posts Plugin for WordPress, Blogger...