పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

29, నవంబర్ 2018, గురువారం

మా గుంటూరు ఆర్ట్స్ & క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ @ గుంట గ్రౌండ్


గుంటూరు గుంట గ్రౌండ్ గుంటూరు వాళ్లందరికీ బాగా తెలిసిన,పరిచయమున్న ప్రదేశం.ఇక్కడ మా చిన్నప్పుడు, అలాగే ఇప్పుడు కూడా సమ్మర్ లో ఎగ్జిబిషన్ పెడతారు.అందుకే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అని, దీన్నే నాజ్ సెంటర్ అని కూడా పిలుస్తారు.ఈ  మధ్య సంవత్సరంలో రెండు మూడు సార్లు ఆర్ట్స్ & క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ కూడా పెడుతున్నారు. మేము కూడా వెళ్తుంటాము. ఎగ్జిబిషన్  విశేషాలు ఈ వీడియోలో చూడొచ్చు. 

 మా గుంటూరు ఆర్ట్స్ & క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ @ గుంట గ్రౌండ్ 





23, నవంబర్ 2018, శుక్రవారం

మా ఊరు - మా స్కూల్ - మా జ్ఞాపకాలు - My School Memories




Old School Memories 
A trip down memory lane..




17, నవంబర్ 2018, శనివారం

శ్రీ చింతల రామలింగేశ్వర స్వామి ఆలయం (రామప్ప గుడి) - మాచర్ల - గుంటూరు జిల్లా



ఆలయంలో 2016 లో ఏర్పాటుచేసిన శివపార్వతుల విగ్రహాలు


మా మాచర్లలోని రామప్పగుడి - శ్రీ గంగా పర్వతవర్ధినీ సమేత, శ్రీ చింతల రామలింగేశ్వర స్వామి ఆలయం చిన్నప్పటి  జ్ఞాపకం.చిన్నప్పుడు కార్తీకమాసం,శివరాత్రి ఇలా పండగరోజుల్లో మాత్రమే ఈ ఆలయం ప్రస్తావన వచ్చేది. ఎందుకంటే ఆ గుడి ఊరికి చాలా దూరంగా ఉండేది.రవాణా సౌకర్యాలు అంతగా ఉండేవి కాదు.అయినా కార్తీకమాసం వనభోజనాలకు,పూజలకు తప్పకుండా ఈ గుడికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు గుడి దగ్గర కూడా ఇళ్ళు,మంచి రోడ్లు,ఆటోలు అన్ని సౌకర్యాలు వచ్చేసాయి.

ఈ గుడి చాలా పురాతనమైనది.జమదగ్ని మహర్షి,రేణుకా మాతల కుమారుడు పరశురాముడు ప్రతిష్టించిన ఆలయంగా చెప్తారు.పరశురాముడు విష్ణుమూర్తి దశావతారాల్లో ఆరవ అవతారం.హైహేయ వంశస్థుడైన కార్తవీర్యార్జున చక్రవర్తి శాపవశాత్తూ చేతులు లేకుండా జన్మించి,దత్తాత్రేయుని పూజించి వేయి చేతులు వరంగా పొందుతాడు.ఒకరోజు వేటకోసం అడవికి వచ్చిన కార్తవీర్యార్జునుడు  జమదగ్ని మహర్షి ఆశ్రమానికి సేదతీరటానికి రాగా జమదగ్ని మహర్షి రాజుకి,ఆయన పరివారానికి పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం పెడతాడు. అది చూసిన కార్తవీర్యార్జునుడు ఓక సాధారణ మహర్షికి ఇదంతా ఎలా సాధ్యపడిందని అడగగా, తన దగ్గరున్న కామధేనువు జాతి గోమాత వలనే అని చెప్తాడు.

అప్పుడు కార్తవీర్యార్జునుడు ఆ గోవును తనకిమ్మని అడగగా మహర్షి నిరాకరిస్తాడు.అందుకో కోపించిన చక్రవరి బలవంతంగా ఆవును తీసుకెళ్ళిపోతాడు.విషయం తెలుసుకున్న పరశురాముడు కార్తవీర్యార్జునుని వేయిచేతులు ఖండించి,సంహరించి గోమాతను తీసుకువస్తాడు.జమదగ్ని మహర్షి పరశురాముడిని మందలించి తపస్సు చేసుకోమ్మని పంపిస్తాడు.పరశురాముడు తండ్రిని చంపినందుకు కక్ష పెంచుకున్న కార్తవీర్యార్జునుని కుమారులు జమదగ్ని మహర్షిని చంపివెళ్ళిపోతారు.తల్లి దుఃఖం చూసిన పరశురాముడు 21 సార్లు భూ ప్రదక్షిణ చేసి, కార్తవీర్యార్జునుని కుమారులతో పాటు అధర్మపరులై ప్రజలను హింసిస్తున్న క్షత్రియ రాజుల్ని  సంహరిస్తాడు. యుద్ధాల్లో  గెలిచిన భూమిని కశ్యప మహర్షికి దానంగా ఇచ్చేసి, పాప ప్రక్షాళన కోసం తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోతాడు

ఆ తపస్సులో భాగంగా శివుడ్ని పూజించి 108 స్వయంభూ శివలింగాలను ప్రతిష్టించినట్లు, అందులో ఒకటి మాచర్ల లోని ఈ రామప్ప గుడి అనేది స్థలపురాణం.రామప్పగుడిని దక్షిణ కాశీగా పిలుస్తారు.ఇక్కడ స్వామిని దర్శిస్తే కాశీలో విశ్వనాధుడ్ని దర్శించినట్లుగా భక్తులు భావిస్తారు.ఇక్కడ స్వామికి స్వయంగా మనమే అభిషేకాలు చేయొచ్చు,స్పర్శదర్శనం చేసుకోవచ్చు.మేము ఈ కార్తీక మాసంలో మొదటి సోమవారం ఈ గుడికి వెళ్ళాము.ఆలయంలో స్వామివారికి అభిషేకాలు,అమ్మవారికి కుంకుమపూజ,రుద్రహోమం, ప్రతిరోజూ భక్తులకు అన్నదానం,సహస్ర దీపాల సేవ అన్ని చాలా బాగా జరుగుతున్నాయి.


మా రామప్పగుడిని ఈ వీడియోలో చూడొచ్చు 
 



15, నవంబర్ 2018, గురువారం

హంసలదీవి.. కృష్ణవేణి పవిత్ర సాగర సంగమం



హంసలదీవి, కృష్ణా జిల్లా కోడూరు మండలంలోని ఒక గ్రామము.మహాబలేశ్వరంలోని  జన్మస్థానము నుండి మొదలైన కృష్ణానది సాగరుణ్ణి కలిసే పవిత్ర సాగర సంగమ ప్రదేశం హంసలదీవి. పాలకాయతిప్ప అనే ప్రదేశం దగ్గర కృష్ణానది సముద్రంలో కలుస్తుంది. ఒకవైపు గట్టుతో కృష్ణమ్మ,మరొకవైపు అనంతమైన బంగాళాఖాతం రెండిటినీ చూడొచ్చు.అందరి పాపాలను కడుగుతూ మలినమైన గంగానది కాకి రూపంలో వచ్చి ఇక్కడి పవిత్ర కృష్ణవేణి సాగర సంగమంలో స్నానం చేయగానే హంసగా మారిపోయింది కాబట్టి ఈ ప్రదేశానికి హంసలదీవి అనే పేరు వచ్చిందనేది స్థలపురాణం.

మేము ముందుగా రేపల్లె,తెనాలి వైపునుండి మోపిదేవి సుబ్రహ్మణ్యస్వామి గుడికి వెళ్లి అక్కడినుండి హంసలదీవి వెళ్ళాము.అగస్త్య మహాముని సుబ్రహ్మణ్యస్వామిని నాగరూపంలో గుర్తించి,ప్రతిష్టించిన సన్నిధానమే మోపిదేవి.సుబ్రహ్మణ్యస్వామి,ఈశ్వరుడు ఒకే రూపంగా కొలువై సుబ్రహ్మణ్యేశ్వరస్వామిగా దర్శనమిచ్చే ఈ క్షేత్రం చాలా మహిమ కలిగినది.

హంసలదీవి కృష్ణా జిల్లాలో విజయవాడకు 110 కి. మీ., అవనిగడ్డకు 25 కి.మీ. దూరంలో వుంది. విజయవాడ నుంచి పామర్రు, కూచివూడి, చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ, కోడూరు దివిసీమ గ్రామాల నుండి వెళ్లొచ్చు అలాగే గుంటూరు నుండి తెనాలి,రేపల్లె వైపు పెనుమూడి వారధి మీదగా వెళ్లొచ్చు.లంక గ్రామాల్లో పచ్చని వాతావరణంలో ప్రయాణం చాలా హాయిగా అనిపిస్తుంది.దారులు బాగానే ఉంటాయి కానీ ఇక్కడికి మన  వెహికల్తో వెళ్తే ఇబ్బంది లేకుండా అన్ని ప్రదేశాలు చూడొచ్చు.

ముందుగా బీచ్ దగ్గరికి వెళ్తాము.బీచ్ దగ్గరనుండి కృష్ణమ్మ సముద్రంలో కలిసే చోటికి మన వెహికల్స్ వెళ్ళటం కష్టం ఎందుకంటే వేగంగా వస్తున్న సముద్రం అలల పక్కనే కారు వెళ్ళాలి.కారు టైర్స్ కూడా లాగేసేంత ఉధృతంగా అలలు వస్తుంటాయి.అందుకే అక్కడ ఆటోలో ఉంటాయి వాళ్ళు  మనిషికి కొంత అమౌంట్ తీసుకుని,సాగరసంగమ ప్రదేశం దగ్గరికి తీసుకెళ్తారు.అక్కడ కృష్ణమ్మ విగ్రహం, పాదాలు ఉంటాయి.ఈ సాగరసంగమ పెద్దలకి పుణ్యస్నానాలకే కాదు పిల్లలు ఆడుకోవటానికి కూడా చాలా సరదాపడతారు.వెంటనే అక్కడినుండి రావాలనిపించదు.ఇక్కడి దగ్గరలో ఒక భవనం ఉంటుంది.దీనిపై నుండి చూస్తే సాగరసంగమ దృశ్యం  చాలా బాగా కనిపిస్తుంది.ఇక్కడికి చీకటి పడకముందే వెళ్తే బాగుంటుంది.ఎందుకంటే అక్కడినుండి వెంటనే రావాలనిపించదు మరి.అక్కడ షోడాలు,ఐస్ క్రీమ్ బండ్లు ఉంటాయి కానీ మనమే మంచి నీళ్ళు,తినటానికి కావాల్సినవి ఏమైనా తీసుకెళ్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది.

ఇక్కడినుండి వేణుగోపాలస్వామి గుడికి వెళ్ళాము. వూర్వం దేవతలు  ఒక్క రాత్రిలోనే ఆలయాన్ని నిర్మించారట. కోడి కూసే సమయానికి రాజగోపురం సగమే పూర్తయింది. తెల్లవారి మనుషుల అలికిడి వినపడటంతో వారు గోపురాన్ని అసంపూర్తిగా వదిలేసి వెళ్ళిపోయారు.తర్వాత చోళ రాజుల కాలంలో ఆలయ పునరుధ్ధరణ జరిగింది.ప్రస్తుతం ఈ ఆలయం విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయానికి దత్తత దేవాలయంగా గుర్తించబడింది.

ఇక్కడికి మేము రెండుసార్లు వెళ్ళాము.వెళ్ళినప్రతిసారి ప్రయాణం విసుగనిపించదు ,అక్కడ గడిపే సమయం కూడా విసుగనిపించదు.మా అందరికీ చాలా నచ్చిన ప్రదేశం హంసలదీవని ఈ వీడియోలో చూడొచ్చు

హంసలదీవి.. కృష్ణవేణీ సాగర సంగమం





10, నవంబర్ 2018, శనివారం

హంసలదీవి.. కృష్ణవేణి పవిత్ర సాగర సంగమం



హంసలదీవి, కృష్ణా జిల్లా కోడూరు మండలంలోని ఒక గ్రామము.మహాబలేశ్వరంలోని  జన్మస్థానము నుండి మొదలైన కృష్ణానది సాగరుణ్ణి కలిసే పవిత్ర సాగర సంగమ ప్రదేశం హంసలదీవి. పాలకాయతిప్ప అనే ప్రదేశం దగ్గర కృష్ణానది సముద్రంలో కలుస్తుంది. ఒకవైపు గట్టుతో కృష్ణమ్మ,మరొకవైపు అనంతమైన బంగాళాఖాతం రెండిటినీ చూడొచ్చు.అందరి పాపాలను కడుగుతూ మలినమైన గంగానది కాకి రూపంలో వచ్చి ఇక్కడి పవిత్ర కృష్ణవేణి సాగర సంగమంలో స్నానం చేయగానే హంసగా మారిపోయింది కాబట్టి ఈ ప్రదేశానికి హంసలదీవి అనే పేరు వచ్చిందనేది స్థలపురాణం.

మేము ముందుగా రేపల్లె,తెనాలి వైపునుండి మోపిదేవి సుబ్రహ్మణ్యస్వామి గుడికి వెళ్లి అక్కడినుండి హంసలదీవి వెళ్ళాము.అగస్త్య మహాముని సుబ్రహ్మణ్యస్వామిని నాగరూపంలో గుర్తించి,ప్రతిష్టించిన సన్నిధానమే మోపిదేవి.సుబ్రహ్మణ్యస్వామి,ఈశ్వరుడు ఒకే రూపంగా కొలువై సుబ్రహ్మణ్యేశ్వరస్వామిగా దర్శనమిచ్చే ఈ క్షేత్రం చాలా మహిమ కలిగినది.

హంసలదీవి కృష్ణా జిల్లాలో విజయవాడకు 110 కి. మీ., అవనిగడ్డకు 25 కి.మీ. దూరంలో వుంది. విజయవాడ నుంచి పామర్రు, కూచివూడి, చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ, కోడూరు దివిసీమ గ్రామాల నుండి వెళ్లొచ్చు అలాగే గుంటూరు నుండి తెనాలి,రేపల్లె వైపు పెనుమూడి వారధి మీదగా వెళ్లొచ్చు.లంక గ్రామాల్లో పచ్చని వాతావరణంలో ప్రయాణం చాలా హాయిగా అనిపిస్తుంది.దారులు బాగానే ఉంటాయి కానీ ఇక్కడికి మన  వెహికల్తో వెళ్తే ఇబ్బంది లేకుండా అన్ని ప్రదేశాలు చూడొచ్చు.

ముందుగా బీచ్ దగ్గరికి వెళ్తాము.బీచ్ దగ్గరనుండి కృష్ణమ్మ సముద్రంలో కలిసే చోటికి మన వెహికల్స్ వెళ్ళటం కష్టం ఎందుకంటే వేగంగా వస్తున్న సముద్రం అలల పక్కనే కారు వెళ్ళాలి.కారు టైర్స్ కూడా లాగేసేంత ఉధృతంగా అలలు వస్తుంటాయి.అందుకే అక్కడ ఆటోలో ఉంటాయి వాళ్ళు  మనిషికి కొంత అమౌంట్ తీసుకుని,సాగరసంగమ ప్రదేశం దగ్గరికి తీసుకెళ్తారు.అక్కడ కృష్ణమ్మ విగ్రహం, పాదాలు ఉంటాయి.ఈ సాగరసంగమ పెద్దలకి పుణ్యస్నానాలకే కాదు పిల్లలు ఆడుకోవటానికి కూడా చాలా సరదాపడతారు.వెంటనే అక్కడినుండి రావాలనిపించదు.ఇక్కడి దగ్గరలో ఒక భవనం ఉంటుంది.దీనిపై నుండి చూస్తే సాగరసంగమ దృశ్యం  చాలా బాగా కనిపిస్తుంది.ఇక్కడికి చీకటి పడకముందే వెళ్తే బాగుంటుంది.ఎందుకంటే అక్కడినుండి వెంటనే రావాలనిపించదు మరి.అక్కడ షోడాలు,ఐస్ క్రీమ్ బండ్లు ఉంటాయి కానీ మనమే మంచి నీళ్ళు,తినటానికి కావాల్సినవి ఏమైనా తీసుకెళ్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది.

ఇక్కడినుండి వేణుగోపాలస్వామి గుడికి వెళ్ళాము. వూర్వం దేవతలు  ఒక్క రాత్రిలోనే ఆలయాన్ని నిర్మించారట. కోడి కూసే సమయానికి రాజగోపురం సగమే పూర్తయింది. తెల్లవారి మనుషుల అలికిడి వినపడటంతో వారు గోపురాన్ని అసంపూర్తిగా వదిలేసి వెళ్ళిపోయారు.తర్వాత చోళ రాజుల కాలంలో ఆలయ పునరుధ్ధరణ జరిగింది.ప్రస్తుతం ఈ ఆలయం విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయానికి దత్తత దేవాలయంగా గుర్తించబడింది.

ఇక్కడికి మేము రెండుసార్లు వెళ్ళాము.వెళ్ళినప్రతిసారి ప్రయాణం విసుగనిపించదు ,అక్కడ గడిపే సమయం కూడా విసుగనిపించదు.మా అందరికీ చాలా నచ్చిన ప్రదేశం హంసలదీవని ఈ వీడియోలో చూడొచ్చు

హంసలదీవి.. కృష్ణవేణీ సాగర సంగమం





Pochampally Ikkath Sarees / పోచంపల్లి చీరలు @ భూదాన్ పోచంపల్లి



పోచంపల్లి చీరలు తెలంగాణ రాష్ట్రములోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన భూదాన్ పోచంపల్లి లో తయారవుతున్న ప్రసిద్ధ చీరలు.తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కి సుమారు  42 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోచంపల్లి చేనేత వస్త్రాలు, భూదానోద్యమానికి ప్రసిద్ధి చెందింది.విజయవాడ హై వే NH65 మీద గుంటూరు నుండి హైదరాబాద్ వెళ్లే దారిలో కుడివైపు పెద్ద ఆర్చ్ కనపడుతుంది.ఆ ఆర్చ్ నుండి లోపలికి వెళ్ళగానే 12 kms చాలా చక్కని రోడ్,చుట్టూ పచ్చని చెట్లతో ప్రయాణం మనకి తెలియకుండానే పోచంపల్లి వచ్చేస్తాము.ఊరిలోకి వెళ్తుండగానే రోడ్డుకి రెండువైపులా చీరాల షాపులు కనపడుతుంటాయి.

అక్కడి చేనేత కార్మికులు నేసిన చీరలు అందరినీ మురిపిస్తాయి. ఇక ఆడవారినైతే అమితంగా ఆకర్షిస్తాయి. చేనేతల్లో మొదటగా పేటెంట్ హక్కు పొందడం ఓ ప్రత్యేకత. దేశ విదేశీ వనితల వరకూ అందరినీ ఆకట్టుకునే చేనేత ఉత్పత్తులు, చీరలతో ఖండాంతర ఖ్యాతిని పోచంపల్లి పొందింది. ఈ పనితనం "చీరాల" నుండి ఈ ప్రాంతానికి వచ్చింది.

చూడగానే ఇవి పోచంపల్లి  చేనేత చీరలు,వస్త్రాలు అని చెప్పగలిగేంత విభిన్నమైన డిజైన్స్ తో చాలా అందంగా హుందాగా అనిపిస్తాయి. పోచంపల్లి చీరలు కానీ డ్రెస్సులు కానీ ఏ సందర్భానికైనా తగినట్లు గా సెట్ అవ్వటం కూడా వీటి ప్రత్యేకత అనిపిస్తుంది.

పోచంపల్లి విశేషాలు ఈ వీడియోలో చూడొచ్చు..

Pochampally Ikkath Sarees 
పోచంపల్లి చీరలు @ భూదాన్ పోచంపల్లి




8, నవంబర్ 2018, గురువారం

A Day In Ramoji Film City - రామోజీ ఫిల్మ్ సిటీ - హైదరాబాద్ -



A Day In Ramoji Film City
రామోజీ ఫిల్మ్ సిటీ - హైదరాబాద్
A must visit Tourist Destination




5, నవంబర్ 2018, సోమవారం

Domino's Pizza @ My Guntur



Domino's Pizza @ My Guntur





4, నవంబర్ 2018, ఆదివారం

Flowers In Daily Life - Making Memories with Flowers



Flowers In Daily Life - Making Memories with Flowers 
పువ్వులంత అందమైన జ్ఞాపకాలు





Related Posts Plugin for WordPress, Blogger...