పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

5, ఫిబ్రవరి 2011, శనివారం

కొరడాదెబ్బ మెల్లగా పడదు...

తప్పు చేసిన పిల్లలను సరైన దారిలో పెట్టే వాళ్ళే పెద్దలు
కానీ దురద్రుష్టవశాత్తు ఇప్పటి సమాజంలో చాలా వరకు పెద్దలు వాళ్ళ పిల్లలు చేసిన తప్పులను కప్పి పుచ్చి ఎదుటి వాళ్ళ పైనే తప్పులను ఆపాదిస్తూ వుంటారు.
ఇవాళ సాక్షి పేపర్ లో ప్రతిరోజూ ఒక కధ పరిచయంలో రంగనాయకమ్మ గారు రాసిన కధ అందరినీ ఆలోచింపచేసేదిగా వుంది.ప్రతి అత్తగారూ ఈ కధలోని మురళీ వాళ్ళమ్మలాగా వుంటే ఏ కోడలికీ మనసును చంపుకుని బ్రతికే అవసరం వుండదు,తమ అబ్బాయి ఎలాంటివాడో అతని తప్పులు ఏమిటో తెలిసి కూడా వాటినే సమర్ధించుకుంటూ మాకొక న్యాయం కోడలికి ఒక న్యాయం అనుకునే ప్రతి అత్తింటి వారు చదవాలసిన కధ ఇది.



Related Posts Plugin for WordPress, Blogger...