పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

17, అక్టోబర్ 2012, బుధవారం

శ్రీ గాయత్రీ వేదమాతా నమోస్తుతే...

శ్రీ గాయత్రీదేవి - 17 - 12 - 2012
ఆశ్వయుజ విదియ

ఈరోజు అమ్మవారిని గాయత్రీ దేవిగా అలంకరిస్తారు.ఐదు ముఖాలతో,వరద అభయ హస్తాలు ధరించి, కమలాసీనురాలుగా  దర్శనమిస్తుంది. గాయత్రీ మాత సకల మంత్రాలకు మూలమైన శక్తి,వేదమాత.ముక్తా విద్రుమ హేమ నీల ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ పంచాముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టాన దేవత.గాయత్రీ మంత్రాన్ని జపిస్తే కీర్తి,దివ్య తేజస్సు, సకల సంపదలు ,సమస్త శుభాలు కలుగుతాయి..సకల దేవతలకు నివేదన చేయబోయే నైవేద్యాలను ముందుగా గాయత్రీ మంత్రం తో నివేదన చేస్తారు.
.


ఓం భూర్ భుహస్వహ
తత్స వితుర్వ రెణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

మా బుద్ధులను ప్రేరేపించునట్టి,జగత్కారణమైనట్టి 
సూర్య భగవానుని సర్వోత్కృష్టమైన తేజస్సును 
మేము ధ్యానించుచున్నాము.
  
గాయత్రీమంత్రం  

 


 

2 కామెంట్‌లు:

భారతి చెప్పారు...

వేదమాత - గాయత్రి(18 నవంబర్ 2011;1 డిసెంబర్ 2011 ) పోస్ట్ ని నా బ్లాగ్ లో పెట్టినప్పుడు ఓ చక్కటి అనుభూతికి లోనయ్యాను. అంతటి ఆనందానుభూతి నేడు మీ పోస్ట్ ద్వారా పొందాను.
మంచి పోస్ట్. అభినందనలు రాజీ గారు!

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"భారతి" గారు..
పోస్ట్ నచ్చినందుకు, మీ అభినందనలకు
ధన్యవాదములు..!

Related Posts Plugin for WordPress, Blogger...